Parliament : పార్లమెంటులో మైక్లను ఎవరు ఆన్ – ఆఫ్ చేస్తారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament : పార్లమెంట్లో మైక్లు స్విచ్ ఆఫ్ చేశారని, తన వాయిస్ని సైలెంట్ చేశారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మూడు రోజుల పాటు తన మైక్రోఫోన్ మ్యూట్ అయిందని ఆరోపిస్తూ లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి బుధవారం స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. వారి ఆరోపణల నేపథ్యంలో ఒక ప్రశ్న తెరపైకి వచ్చింది. పార్లమెంటు సభ్యుల మైక్రోఫోన్లను ఎవరు ఆన్ లేదా ఆఫ్ చేస్తారు? వాటి ప్రోటోకాల్లు ఏమిటి?
ప్రతి పార్లమెంటు సభ్యునికి నిర్ణీత సీటు ఉంటుంది. మైక్రోఫోన్లు డెస్క్లకు ఫిట్ చేసి ఉంటాయి. ప్రతీ దానికి ఓ స్పెషల్ నెంబర్ ఉంటుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో సౌండ్ టెక్నీషియన్లు కూర్చునే చాంబర్ ఉంది. వారు లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలను రికార్డ్ చేస్తుంటారు. ఛాంబర్లో అన్ని సీట్ల సంఖ్యలతో కూడిన ఎలక్ట్రానిక్ బోర్డు ఉంది. అక్కడ నుండి మైక్రోఫోన్లను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. దిగువ సభ విషయంలో లోక్సభ సెక్రటేరియట్ సిబ్బంది, ఎగువ సభ విషయంలో రాజ్యసభ సెక్రటేరియట్ సిబ్బంది దీనిని నిర్వహిస్తారు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
Read Also: High Court Serious: దక్షిణ మధ్య రైల్వే జీఎంపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టు అంటే లెక్కలేదా..?
పార్లమెంట్ కార్యకలాపాలను కవర్ చేసిన నిపుణులు, ప్రముఖ పాత్రికేయులు, మైక్రోఫోన్లను స్విచ్ ఆన్, ఆఫ్ చేయడానికి నిర్దేశిత విధానం ఉందని చెప్పారు. మైక్రోఫోన్లను స్విచ్ ఆఫ్ చేయమని, అది కూడా నిబంధనల ప్రకారం చైర్మన్ మాత్రమే చేయగలదని వారు చెప్పారు. ప్రొసీడింగ్లకు అంతరాయం కలిగితే ఈ అధికారాన్ని వినియోగించుకోవచ్చు. ఉభయ సభల్లో మైక్రోఫోన్లు మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేయబడుతాయి. రాజ్యసభ అధ్యక్షుని ఆదేశాల మేరకు మైక్రోఫోన్లు స్విచ్ ఆన్ చేయబడతాయని డిఎంకె రాజ్యసభ ఎంపి, ప్రముఖ న్యాయవాది పి విల్సన్ చెప్పారు.
Read Also:Damidi Semanthi: తెర వెనుక పోనీవర్మ… తెర మీద రమ్యకృష్ణ!
జీరో అవర్లో ప్రతి సభ్యునికి మూడు నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. అది పూర్తి కాగానే మైక్రోఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. బిల్లులు మొదలైన వాటిపై చర్చలు జరిగినప్పుడు, ప్రతి పక్షానికి సమయం అనుమతించబడుతుంది. చైర్మన్ ను కోరితే మరో ఒకటి లేదా రెండు నిమిషాలు మంజూరు చేస్తారు. ఒక వేళ సభ్యుడు మాట్లాడటం తన వంతు కాకపోతే ఎంపీ మైక్ స్విచ్ ఆఫ్ చేయబడవచ్చు. ప్రత్యేక ప్రస్తావనల విషయంలో, ఎంపీలకు మూడు నిమిషాలు కేటాయిస్తారు. నిర్ణీత సమయం తర్వాత, ఎంపీ మైక్ స్విచ్ ఆఫ్ చేయబడుతుంది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?