ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత రిటైర్ తీసుకోబోతున్నారా? అనే ప్రశ్నకు డెఫనెట్ లీ నాట్ అంటూ ఎంఎస్ ధోనీ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2021, ఐపీఎల్ 2022 సీజన్ల సమయంలోనూ ధోనీ రిటైర్మెంట్ గురించి వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత ధోనీ రిటైర్ కాబోతున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మహీ ఫేర్ వెల్ సీజన్ అంటూ ఐపీఎల్ 2023 టీవీ ప్రసార హక్కులు సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ కూడా ప్రచారం చేస్తోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహార్ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టి పారేశాడు. ధోనీకి ఇదే ఆఖరి సీజన్ అని ఎవరు చెప్పారు? టీమ్ లో ఎవ్వరూ కూడా ఇది మహీ భాయ్ లాస్ట్ సీజన్ అని చెప్పలేదు. కనీసం మహీ భాయ్ కూడా ఇలా చెప్పలేదు అని సీఎస్కే బౌలర్ దీపక్ చాహార్ అన్నారు.
Also Read : Illegal Affair: అక్రమం సంబంధం మోజులో.. కట్టుకున్న భర్తను కాటికి పంపిన వైనం
తనకు తెలిసి ధోనీ భాయ్ ఇంకా చాలా సీజన్లు ఆడతాడు.. మహీ భాయ్ ఇప్పటికీ చాలా ఫిట్ గా ఉన్నాడు. ఈజీగా సిక్సర్లు బాదుతున్నాడు అని దీపక్ చాహర్ తెలిపారు. ధోనీ రిటైర్ అవ్వబోతున్నాడని మాకు ఎలాంటి సమాచారం లేదు.. ఆయన చాలా సీజన్లు ఆడాలని కోరుకుంటున్నాం.. ధోనీకి ఎప్పుడు రిటైర్ కావాలో బాగా తెలుసు.. టెస్టులో ఎవ్వరూ ఊహించని టైమ్ లో రిటైర్మెంట్ తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా అంతే ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడనేది ఎవ్వరూ ఊహించలేదు.. ఈసారి కూడా అలాంటి ట్విస్టే ఉంటుందేమో.. ఇలా అందరూ అనుకుంటున్నప్పుడు ధోనీ రిటైర్మెంట్ ఇవ్వడేనే నమ్ముతున్నా.. ధోనీ కెప్టెన్సీలో ఆడడం నాకు దక్కిన గౌరవం, అదృష్టం అంటూ దీపక్ చాహర్ అన్నారు.
Also Read : IND vs AUS 2nd ODI: ఘోర పరాజయం.. టీమిండియా పేరిట చెత్త రికార్డులు
ఎంతో మంది క్రికెటర్లు ధోనీ కెప్టెన్సీలో ఆడాలని కలలు కంటారు. తనకు చాలా తక్కువ వయసులోనే ఆ అదృష్టం దక్కింది. నెట్స్ లోమహీ భాయ్ చాలా బాగా ఆడుతున్నారు. ఈసారి ఆయన బ్యాట్ నుంచి అద్బతుమైన షాట్స్ చూస్తారు అంటూ కామెంట్ చేశారు. ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన అయితే చెన్నైలో తన టీమ్ సొంత అభిమానుల మధ్య ఆఖరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నా.. అంటూ సీఎస్కే బౌలర్ దీపక్ చాహార్ అన్నారు. మహీ భాయ్ ఐపీఎల్ 2019 తర్వాత మూడు సీజన్లు కరోనా ఆంక్షల కారణంగా చెన్నైలో సీఎస్కే మ్యాచ్ లో జరుగలేదు. నాలుగేళ్ల తర్వాత చెన్నై చెపాక్ స్టేడియంలో సొంత అభిమానుల మధ్య చెన్నై సూపర్ కింగ్స్
మ్యాచ్ లు ఆడనుంది.