What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలో నేడు రెండో రోజు ధార్మిక సదస్సును నిర్వహిస్తారు. ఈ సదస్సుకు 32 మంది స్వామీజీలు హాజరుకానున్నారు. సనాతన ధర్మంలో భాగంగా ఆధ్యాత్మిక భావవ్యాప్తి కోసం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. పీఠాధిపతులు, మాఠాథిపతుల సూచనలు, సలహాలను తీసుకొని హిందూ ధర్మప్రచారం చేయనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. దీని ద్వారా శ్రీవారి వైభవాన్ని, హైందవ సంస్కృతిని వ్యాప్తి చేసేందుకు తిరుమల ఓ మంచి వేదిక కాబోతుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు టీడీపీ వేద సదస్సును నిర్వహిస్తోంది.
నేడు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. పవన్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం తనకు ఉందని, తనతో పాటు జనసేనలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారని శనివారం మీడియాతో బాలశౌరి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పవన్ నిర్ణయిస్తారని ఆయన చెప్పారు.
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
నేడు కేంద్రమంత్రి అర్జున్ ముండా విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. గిరిజన సంస్కృతిక యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సహకారంతో ఆంధ్రప్రదేశ్ వనవాసీ కళ్యాణ ఆశ్రమం తూర్పు కనుమల గిరిజన సంస్కృతిక యాత్ర ఫిబ్రవరి 4వ తేదీన విశాఖపట్నంలో ముగియనుంది.
నేడు జీవీఎంసీ ఎదుట ఉపాధ్యాయులు సాగర సంగ్రామ దీక్ష చేపట్టనున్నారు. ఓట్ ఫర్ ఓపీఎస్ నిదానంతో ఉపాధ్యాయుల సమావేశం జరగనుంది. పాట పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేయనున్నారు.
నేడు తెలంగాణ కెబినెట్ కీలక భేటి జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కెబినెట్ భేటి సెక్రటేరియెట్లో జరగనుంది. అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వాహాణపై మంత్రులు నిర్ణయించనున్నారు. అలానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై సమావేశం జరగనుంది. ఆరు గ్యారెంటీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులపై చర్చ జరగనుంది.
Also Read: Telangana Temperature: తెలంగాణలో పెరుగుతున్న ఎండలు.. హైదరాబాద్లో 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు!
విశాఖ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానుంది. తొలి ఇన్నింగ్స్లో 143 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా.. రెండో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్లో 28/0తో నిలిచింది. యశస్వి జైస్వాల్ (15), రోహిత్ శర్మ (13) క్రీజులో ఉన్నారు. అంతకుముందు జస్ప్రీత్ బుమ్రా (6/45) బౌలింగ్కు తలవంచిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది.
తాజావార్తలు
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!