NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today New

Whats Today New

* నేడు వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల చేయనున్న మోడీ.. 9.26 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ చేయనున్న ప్రధాని

* ఢిల్లీ: నేడు కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న శ్రీనివాసవర్మ

* హైదరాబాద్‌: నేటి నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు.. మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీలతో భేటీ కానున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. నేడు వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల ప్రతిపాదనలపై చర్చ

* హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన లేఖపై నేడు విద్యుత్ విచారణ కమీషన్ విశ్లేషణ, సమీక్ష

* హైదరాబాద్‌: ఈ రోజు ఉదయం 9 గంటలకు తీహార్ జైల్ లో ఎమ్మెల్సీ కవితతో ములాఖాత్ అవ్వనున్న మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి

* ప్రకాశం : అమరావతి వెళ్లనున్న జిల్లాకు చెందిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిలు..

* తిరుమల: ఇవాళ్టి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ.. ఇవాళ లక్కీడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు విడుదల, 21వ తేదీన వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. 22న వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, అంగప్రదక్షణ దర్శన టిక్కెట్లు విడుదల, 24వ తేదీన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదులు కోటా విడుదల

* ప్రకాశం : ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..

* ప్రకాశం: సింగరాయకొండలో పురాణ ప్రసిద్ధ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు..

* ప్రకాశం: పెద్దరవీడు మండలం గొబ్బూరు పోలేరమ్మ ఆలయ వార్షిక తిరునాళ్ళలో భాగంగా రాష్ట్ర స్థాయి ఎద్దుల బండ లాగుడు పోటీలు..

* తిరుమల: రేపటి నుంచి మూడు రోజులు పాటు వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

* నెల్లూరు జిల్లా: దుత్తలూరు మండలం నర్రవాడలో జరగనున్న శ్రీ వెంగమాంబ ఉత్సవాలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న కావలి ఆర్డీవో శీనా నాయక్

* నెల్లూరులోని కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ హరి నారాయణన్ సమీక్ష సమావేశం

* నేడు కడపకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు రాక.. కలెక్టర్ కార్యాలయంలోని సభా భవన్ లో జరిగే పీఎం కిసాన్ పథకం విడుదల కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి

* శ్రీ సత్యసాయి : జిల్లాకు రానున్న ఏపి వ్తెద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జిల్లాకు రానున్న మంత్రి.. బత్తలపల్లి నుంచి ధర్మవరం వరకు ర్యాలీ, స్వాగత ఏర్పాట్లు చేసిన కార్యకర్తలు.

* యాదాద్రి జిల్లా : యాదగిరిగుట్టలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణ.. ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈవో భాస్కరరావు, మొదటిరోజు గిరి ప్రదక్షణలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు.