* ఐపీఎల్: ఇవాళ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్.. హైదరాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* ఢిల్లీ: ఉదయం 11 గంటలకు విజ్ఞాన్ భవన్లో నారీ శక్తి వందన సమ్మేళనం.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ.. మహిళలను ఉద్దేశించి ప్రసంగం
* ముంబై: నేడు ఆశా భోస్లే అంత్యక్రియలు.. సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్లో అంతిమ సంస్కారాలు.. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు..
* తిరుమల: 20 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు .. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,743 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 30,276 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు
* నేడు మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన.. రాష్ట్రపతి ముర్ముతో భేటీకానున్న మంత్రి లోకేష్.. అమరావతి రాజధాని బిల్లు ఆమోదం, పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం
* విజయనగరం: సంచలనం సృష్టించిన రామతీర్థం ఘటన.. ధ్వంసమైన కోదండ రామస్వామి విగ్రహాలు.. ఇవాళ ఆగమశాస్త్రం ప్రకారం నిమజ్జనం
* ఏపీకి వడగాలుల హెచ్చరిక.. ఇవాళ 51 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. 49 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు
* అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగుళూరు లోని తన నివాసం నుంచి బయలుదేరి సాయంత్రం 5.40 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకోనున్న జగన్..
* కర్నూలు: నేడు గూడూరులో శ్రీ తిమ్మగురుడు స్వామి రథోత్సవం
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ఈవోగా నల్లం సూర్య చక్రధరరావు…! నేడు అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, పుష్పర్చన, బిల్వార్చన, కనకాభిషేకం, రుధ్రాభిషేకం, పాలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు.
* శ్రీ సత్యసాయి : నేడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం నియోజకవర్గ పర్యటన.. బత్తలపల్లి మండల కేంద్రంలో బీజేపీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. తాడిమర్రి మండలం,పట్రపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందిస్తారు…
* విజయవాడ: నేడు దుర్గగుడి పాలక మండలి సమావేశం .. 11 గంటలకు సమావేశం ప్రారంభం .. ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన అదనపు వసతులు ఇతర కీలక అంశాల పై చర్చ
* విజయవాడ: టెర్రర్ లింకుల కేసులో నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ.. ఆరుగురు నిందితులను 4 రోజులుగా విచారించిన పోలీసులు.. ఇవాళ విచారణ జరిపి వైద్య పరీక్షల తర్వాత నిందితులను కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
* ఆదిలాబాద్ జిల్లాలో నేడు డీజీపీ శివధర్ రెడ్డి పర్యటన. ఉమ్మడి జిల్లాలో రెండవ రోజు పర్యటన.. ఇవాళ జిల్లాలో పలు మండలాల్లో కార్యక్రమాల్లో పాల్గొననున్న డీజీపీ. నిన్న మంచిర్యాల , కొమురం భీం జిల్లాల్లో సాగిన పర్యటన.
* నిర్మల్: నేడు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పర్యటన. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీ.. ఉదయం 10:00 గం. కొమురం భీం చౌరస్తా నుండి ఖానాపూర్ మున్సిపాలిటీ విజయోత్సవ ర్యాలీ ప్రారంభం.. తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింపు.. 11:30 గంటలకు మున్సిపల్ చైర్మన్ బాధ్యతలు స్వీకరణ.. మధ్యాహ్నం 2.30కి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొననున్న టీజీ బీజేపీ చీఫ్..
* భద్రాద్రి: నేడు భద్రాచలంలో ఉద్యోగ సంఘాలకు ప్రత్యేక సమావేశం.. ఐదు గ్రామాలని ఏపీ నుంచి భద్రాచలంకి అప్పగించి అభివృద్ధికి సహకరించాలని డిమాండ్.. ఆందోళనలో పాల్గొననున్న ఎంపీ రేణుకా చౌదరి. ఐదు గ్రామాల్ని కలపాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి మంత్రులకు విజ్ఞప్తి చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు