* ఐపీఎల్ 2024: నేడు ముంబైతో కోల్కతా ఢీ.. కోల్కతా వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్
* ఈ రోజు నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి చివరి రోజు.. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనున్న ప్రచారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు నాల్గో విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించనున్న ఈసీ.. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్.
* తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా.. నేడు వికారాబాద్ , వనపర్తిల్లో అమిత్ షా సభలు.. మధ్యాహ్నం మూడు గంటలకు అమిత్ షా మీడియా సమావేశం
* నేడు ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. ఉదయం 10 గంటలకు పఠాన్ చెరు కార్నర్ మీటింగ్లో పాల్గొననున్న సీఎం.. మధ్యాహ్నం 1 గంటకు తాండూర్ జన జాతర సభకు ప్రియాంక గాంధీతో కలిసి హాజరుకానున్న ముఖ్యమంత్రి.. సాయంత్రం 3.15 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డి రోడ్ షోలో పాల్గొననున్న సీఎం.
* ప్రకాశం: కొత్తపట్నం మండలం సుంకువారికుంటలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం: దర్శిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న దర్శి వైసిపి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* నేడు కడపకు రాహుల్ గాంధీ.. ఉదయం 11.30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్గాంధీ.. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించనున్న రాహుల్.. మధ్యాహ్నం కడపలో బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ.
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: ఈ రోజు సాయంత్రం ముగియనున్న ఎన్నికల ప్రచారాలు. ప్రచారాలు ముగిసిన సమయం నుండి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలు: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.. 13వ తేదీన పోలింగ్ ముగిసే సమయం 48 గంటలలోపు బహిరంగ సభలు, ఊరేగింపులు, అన్ని రకాల ప్రచారాలపై నిషేధం…
* నేడు చిత్తూరులో చంద్రబాబు పర్యటన.. ఎన్నికల ముగింపు ప్రచారాన్ని చిత్తూరు సభతో ముగించనున్న చంద్రబాబు … చిత్తూరు సభ అనంతరం నేరుగా తిరుమల వెళ్ళనున్న చంద్రబాబు.
* తిరుమల: ఇవాళ రాత్రికి శ్రీవారిని దర్శించుకోనున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఎన్నికల ప్రచారం ముగించుకున్న అనంతరం తిరుమలకు చేరుకోనున్న చంద్రబాబు.. రాత్రికి స్వామివారిని దర్శించుకోనున్న చంద్రబాబు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాలనీ గోవర్ధన్ రెడ్డి పొడలకూరులో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు
* నెల్లూరు: ఆత్మకూరులో జరిగే వైసిపి ర్యాలీలో పాల్గొననున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* నెల్లూరు: మనుబోలులో టిడిపి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ర్యాలీ.. పాల్గొననున్న సర్వేపల్లి టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి
* నెల్లూరు నగరంలోని నవాబ్ పేట నుంచి రామ్మూర్తి నగర్ వరకూ వైసిపి కార్యకర్తల బైక్ ర్యాలీ.. పాల్గొననున్న నెల్లూరు లోక్ సభ వైసిపి అభ్యర్థి విజయసాయిరెడ్డి
* నెల్లూరు: కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో రోడ్ షో…
* అనంతపురం : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈనెల13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నేటి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు.
* కాకినాడ: నేడు తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురానికి హీరో రామ్ చరణ్.. తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సమావేశం కానున్న రామ్ చరణ్
* కాకినాడ: నేడు పిఠాపురానికి సీఎం వైఎస్ జగన్.. ఎన్నికల ప్రచార ముగింపు సభలో పాల్గొనున్న జగన్
* నేడు కాకినాడలో రోడ్ షో, ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న పవన్ కల్యాణ్..
* పశ్చిమ గోదావరి: నేడు నర్సాపురం పార్లమెంటు పరిధిలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ ప్రచారం.. బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ తరఫున భీమవరంలో ర్యాలీ నిర్వహించనున్న కేంద్రమంత్రి..
* తిరుపతి: నేడు నగరంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రోడ్ షో. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 9 గంటలకు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి నాలుక్కాళ్ళ మండపం వరకు జేపీ నడ్డా, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు రోడ్ షో.. పాల్గొననున్న టీడీపీ-జనసేన-బీజేపీ ముఖ్య నేతలు..
* శ్రీ సత్యసాయి : రొళ్ల మండలంలో జరిగే కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ .
* నేడు నంద్యాలలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం.. రాజ్ థియేటర్ సర్కిల్లో ప్రజాగళం సభలో పాల్గొననున్న చంద్రబాబు.
* కర్నూలు: నేడు ఆదోనిలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం..
* నంద్యాల: నేడు శ్రీశైలం ఆలయంలో రత్నగర్భ గణపతికి చవితి పూజలు.. ఆరుద్రోత్సవం సందర్భంగా శ్రీమల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
* నేడు కైకలూరు కు సీఎం జగన్.. మధ్యాహ్నం 1 గంటకు కైకలూరు బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్
* ఇవాళ చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురంలో జగన్ ఎన్నికల ప్రచారం.. పిఠాపురం సభతో ముగియనున్న వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం
* నేడు నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవికి సంఘీభావంగా ఆయన ఇంటికి వెళ్లి మద్దతు తెలపనున్న హీరో అల్లు అర్జున్
* తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకేన్ లేని భక్తులుకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60545 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 32,527 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.2.53 కోట్లు