*నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొల్లూరు పోలీస్ స్టేషన్ను ప్రారంభించనున్న మంత్రి
*నేడు నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా జరిగే తెలంగాణ సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.
*నేడు ఖమ్మంలో హోంమంత్రి మహమూద్ అలీ పర్యటన. రఘునాథ పాలెం మండల పోలీస్ స్టేషన్ను ప్రారంభించనున్న మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్.
*హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్న చేపమందు పంపిణీ.. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు 95వేల మందికి చేప మందు పంపిణీ చేసిన బత్తిన సోదరులు .. ఈ ఉదయం 8 గంటల వరకు మరో 50వేల మందికి చేప మందు పంపిణీ
*తిరుపతి: నేడు శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ బహిరంగ సభ.. ఇవాళ తిరుపతి ,శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన.. సాయంత్రం బహిరంగ సభలో పాల్గొననున్న నడ్డా.. మోడీ తొమ్మిదేళ్ల పాలనపై వివరించనున్న నడ్డా.. అనంతరం ఢిల్లీకి పయనం
*నేడు విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు వేళల్లో మార్పు.. 4గంటలు ఆలస్యంగా బయలుదేరనున్న వందేభారత్.. ఉ.9 గంటలకు బయలుదేరనున్న రైలు
*ఏపీ: నేటి నుంచి 120 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఈ సేవలు
