*నిర్మల్ జిల్లా లో నేడు సీఎం కేసీఆర్ పర్యటన.. సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం.
*నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు.. దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పరీక్ష.. ఈ నెల 18న ఫలితాలు
*తెలంగాణ: నేటి నుంచి అందుబాటులో గ్రూప్-1 హాల్ టికెట్స్.. ఈ నెల 11 న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష
*కడప: నేడు ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి సంస్మరణ సభ..
*తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి జేష్ఠాభిషేకం ఉత్సవాలు.. ఇవాళ స్వర్ణకవచంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
*ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ.. నేడు పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసిన టీటీడీ.. శ్రీవారి ఆలయంలో జేష్ఠాభిషేకం ముగింపు కార్యక్రమం కారణంగా పౌర్ణమి గరుడ సేవ రద్దు
*నేడు భారత్కు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్.. కేంద్ర మంత్రి రాజ్నాథ్తో కీలక చర్చలు
*తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,300.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,,330.. కిలో వెండి ధర రూ. 77,800
