Rs.2000Note: కొత్త గడువు తర్వాత రూ.2000 నోట్లు ఏమౌతాయి? ఆర్బీఐ ఏం చెప్పిందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.2000Note: 2000 రూపాయల నోటును ఇంకా మార్చుకో లేకపోయిన వారికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ గొప్ప ఉపశమనం కలిగించింది. ఇప్పుడు దాని కొత్త గడువు అక్టోబర్ 7. అప్పటికి కూడా రూ.2000 నోటును ఎవరైనా మార్చుకునేందుకు వీలు కలుగకపోతే ఏమవుతుంది అనేది సామాన్యుల మదిలో మెదులుతున్న ప్రశ్న. అక్టోబర్ 7 తర్వాత రూ.2000 నోటు పనికి రాకుండా పోతుందా ? లేక ఆర్బీఐ మళ్లీ గడువు పెంచుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ దేశంలోని సెంట్రల్ బ్యాంక్ సమాధానమిచ్చింది. ఈ విషయాల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి సమాచారం ఇచ్చింది. సాధారణ ప్రజలకు ఏ విషయాలు స్పష్టం చేసిందో తెలుసుకుందాం.
అక్టోబర్ 7 తర్వాత రూ.2000 నోటు ఏమవుతుంది?
అక్టోబరు 8 నుంచి బ్యాంకు శాఖల్లో రూ.2000 నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. ఇక్కడ కూడా మార్పిడికి సంబంధించిన నియమాలు గతంలో ఉన్నట్లే ఉంటాయి. 2000 రూపాయల నోట్లను 20 వేల రూపాయల వరకు అంటే 10 నోట్లను మాత్రమే ఒకేసారి మార్చుకోవచ్చు. ఏదైనా వ్యక్తి లేదా సంస్థ తమ బ్యాంకు ఖాతాలో 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయాలనుకుంటే, వారు దానిని ఆర్బిఐ కార్యాలయాల్లో మాత్రమే జమ చేయాలి. డిపాజిట్లు చేయడానికి పరిమితి లేదు. దేశంలో నివసించే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా అక్టోబర్ 7 తర్వాత అంటే అక్టోబర్ 8 నుండి తమ బ్యాంక్ ఖాతాలో రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి పోస్టాఫీసు సహాయం తీసుకోవచ్చు, అది దేశంలోని 109 RBI కార్యాలయాలకు పంపబడుతుంది.
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
Read Also:Today Horoscope : ఈరోజు ఆ రాశుల వాళ్లు జాగ్రత్తగా ఉండాలి..
ఎక్స్ఛేంజీలు, డిపాజిట్లు సంబంధిత RBI/ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటాయి. వ్యక్తులు, సంస్థలు కూడా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలను సమర్పించవలసి ఉంటుంది. RBI నిబంధనల ప్రకారం కొన్ని ఛార్జీలు కూడా విధించబడవచ్చు. న్యాయస్థానాలు, చట్టపరమైన అమలు సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లేదా దర్యాప్తు ప్రక్రియలు లేదా ఎన్ఫోర్స్మెంట్లో పాలుపంచుకున్న ఏదైనా ఇతర పబ్లిక్ అథారిటీ, అవసరమైనప్పుడు రూ. 2000 బ్యాంకు నోట్లను ఎటువంటి పరిమితి లేకుండా 19 ఆర్బీఐ జారీ చేసే కార్యాలయాల్లో ఏదైనా డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు.
మే 19న ఆర్బీఐ నోటిఫికేషన్
రూ.2000 నోట్ల చలామణికి సంబంధించి ఆర్బీఐ మే 19, 2023న నోటిఫికేషన్ జారీ చేసింది. మే 23 నుంచి రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. బ్యాంకులు లేదా 198 RBI ప్రాంతీయ కార్యాలయాలలో 2000 రూపాయల నోట్లను మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని ఆర్బీఐ సాధారణ ప్రజలను కోరింది. అందుకు గడువును సెప్టెంబర్ 30గా ఉంచింది. సెప్టెంబరు 30 తర్వాత రూ. 2000 బ్యాంకు నోట్లు ఏమౌతాయనేది ప్రాథమిక నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పలేదు. 2000 లీగల్ టెండర్ స్టేటస్ను ఆర్బీఐ ఉపసంహరించుకోలేదు. 2000 బ్యాంకు నోట్లు చట్టబద్ధమైన కరెన్సీగానే ఉంటాయని ఆర్బీఐ పత్రికా ప్రకటనలో తెలిపింది.
Read Also:Today Gold Price: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
14 వేల కోట్ల నోట్ల కోసం ఎదురుచూపులు
నెలవారీ పత్రికా ప్రకటనల ద్వారా ఉపసంహరణ ప్రక్రియ స్థితి గురించి ఆర్బీఐ ప్రజలకు తెలియజేస్తోంది. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం, మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. అందులో రూ. 3.42 లక్షల కోట్లు తిరిగి వచ్చాయి. సెప్టెంబర్ 29న వ్యాపారం ముగిసే వరకు కేవలం రూ. 14 వేల కోట్లు మాత్రమే సామాన్య ప్రజలు లేదా సంస్థల వద్ద ఉన్నాయి. ఈ విధంగా మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 96 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?