Rs.2000Note: కొత్త గడువు తర్వాత రూ.2000 నోట్లు ఏమౌతాయి? ఆర్బీఐ ఏం చెప్పిందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.2000Note: 2000 రూపాయల నోటును ఇంకా మార్చుకో లేకపోయిన వారికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ గొప్ప ఉపశమనం కలిగించింది. ఇప్పుడు దాని కొత్త గడువు అక్టోబర్ 7. అప్పటికి కూడా రూ.2000 నోటును ఎవరైనా మార్చుకునేందుకు వీలు కలుగకపోతే ఏమవుతుంది అనేది సామాన్యుల మదిలో మెదులుతున్న ప్రశ్న. అక్టోబర్ 7 తర్వాత రూ.2000 నోటు పనికి రాకుండా పోతుందా ? లేక ఆర్బీఐ మళ్లీ గడువు పెంచుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ దేశంలోని సెంట్రల్ బ్యాంక్ సమాధానమిచ్చింది. ఈ విషయాల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి సమాచారం ఇచ్చింది. సాధారణ ప్రజలకు ఏ విషయాలు స్పష్టం చేసిందో తెలుసుకుందాం.
అక్టోబర్ 7 తర్వాత రూ.2000 నోటు ఏమవుతుంది?
అక్టోబరు 8 నుంచి బ్యాంకు శాఖల్లో రూ.2000 నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. ఇక్కడ కూడా మార్పిడికి సంబంధించిన నియమాలు గతంలో ఉన్నట్లే ఉంటాయి. 2000 రూపాయల నోట్లను 20 వేల రూపాయల వరకు అంటే 10 నోట్లను మాత్రమే ఒకేసారి మార్చుకోవచ్చు. ఏదైనా వ్యక్తి లేదా సంస్థ తమ బ్యాంకు ఖాతాలో 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయాలనుకుంటే, వారు దానిని ఆర్బిఐ కార్యాలయాల్లో మాత్రమే జమ చేయాలి. డిపాజిట్లు చేయడానికి పరిమితి లేదు. దేశంలో నివసించే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా అక్టోబర్ 7 తర్వాత అంటే అక్టోబర్ 8 నుండి తమ బ్యాంక్ ఖాతాలో రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి పోస్టాఫీసు సహాయం తీసుకోవచ్చు, అది దేశంలోని 109 RBI కార్యాలయాలకు పంపబడుతుంది.
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
Read Also:Today Horoscope : ఈరోజు ఆ రాశుల వాళ్లు జాగ్రత్తగా ఉండాలి..
ఎక్స్ఛేంజీలు, డిపాజిట్లు సంబంధిత RBI/ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటాయి. వ్యక్తులు, సంస్థలు కూడా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలను సమర్పించవలసి ఉంటుంది. RBI నిబంధనల ప్రకారం కొన్ని ఛార్జీలు కూడా విధించబడవచ్చు. న్యాయస్థానాలు, చట్టపరమైన అమలు సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లేదా దర్యాప్తు ప్రక్రియలు లేదా ఎన్ఫోర్స్మెంట్లో పాలుపంచుకున్న ఏదైనా ఇతర పబ్లిక్ అథారిటీ, అవసరమైనప్పుడు రూ. 2000 బ్యాంకు నోట్లను ఎటువంటి పరిమితి లేకుండా 19 ఆర్బీఐ జారీ చేసే కార్యాలయాల్లో ఏదైనా డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు.
మే 19న ఆర్బీఐ నోటిఫికేషన్
రూ.2000 నోట్ల చలామణికి సంబంధించి ఆర్బీఐ మే 19, 2023న నోటిఫికేషన్ జారీ చేసింది. మే 23 నుంచి రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. బ్యాంకులు లేదా 198 RBI ప్రాంతీయ కార్యాలయాలలో 2000 రూపాయల నోట్లను మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని ఆర్బీఐ సాధారణ ప్రజలను కోరింది. అందుకు గడువును సెప్టెంబర్ 30గా ఉంచింది. సెప్టెంబరు 30 తర్వాత రూ. 2000 బ్యాంకు నోట్లు ఏమౌతాయనేది ప్రాథమిక నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పలేదు. 2000 లీగల్ టెండర్ స్టేటస్ను ఆర్బీఐ ఉపసంహరించుకోలేదు. 2000 బ్యాంకు నోట్లు చట్టబద్ధమైన కరెన్సీగానే ఉంటాయని ఆర్బీఐ పత్రికా ప్రకటనలో తెలిపింది.
Read Also:Today Gold Price: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
14 వేల కోట్ల నోట్ల కోసం ఎదురుచూపులు
నెలవారీ పత్రికా ప్రకటనల ద్వారా ఉపసంహరణ ప్రక్రియ స్థితి గురించి ఆర్బీఐ ప్రజలకు తెలియజేస్తోంది. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం, మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. అందులో రూ. 3.42 లక్షల కోట్లు తిరిగి వచ్చాయి. సెప్టెంబర్ 29న వ్యాపారం ముగిసే వరకు కేవలం రూ. 14 వేల కోట్లు మాత్రమే సామాన్య ప్రజలు లేదా సంస్థల వద్ద ఉన్నాయి. ఈ విధంగా మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 96 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి.
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!