Congress vs TMC: బెంగాల్లో మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ వ్యూహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress vs TMC: కేంద్రంలో బీజేపీని ఎదుర్కోవడానికి ఏర్పడిన ‘ఇండియా’ కూటమి ఐక్యత రాష్ట్రాల ఎన్నికల నాటికి కరిగిపోతోంది. ఈ పరిస్థితి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రంలో మమతా బెనర్జీతో కలిసి అడుగులు వేసే కాంగ్రెస్, బెంగాల్ గడ్డపై మాత్రం ఆమెను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ముస్లిం జనాభా అధికంగా ఉండే మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్, పురూలియా జిల్లాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పట్టును దెబ్బతీయాలని కాంగ్రెస్ వ్యూహం పన్నుతుంది.
READ ALSO: 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!
Also Read
- CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- NALSAR: "CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం".. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
- Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
ఇక్కడ అల్పసంఖ్యాక వర్గాల ఓట్ల కోసం ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు, హుమాయూన్ కబీర్ – అసదుద్దీన్ ఒవైసీల కూటమి పోటీ పడుతుండగా.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తన సర్వశక్తులూ ఒడ్డుతోంది. దార్జీలింగ్లో కూడా రాజీవ్ గాంధీ కాలం నాటి పాత సంబంధాలను గుర్తు చేస్తూ మమతకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది హస్తం పార్టీ. ఏప్రిల్ 9న మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగానే, కాంగ్రెస్ అగ్రనేతలు బెంగాల్లో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ 3 భారీ బహిరంగ సభలు, ప్రియాంక గాంధీ 3 ప్రధాన ర్యాలీలు, దళిత ఓటర్లను ఆకర్షించేందుకు ఎస్సీ, ఎస్టీ ప్రాబల్యం ఉన్న కూచ్ బెహార్, అలీపుర్దువార్, జల్పాయ్గురి ప్రాంతాల్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ రోజు కోల్కతాలో మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు. ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలను కాంగ్రెస్ అస్త్రాలుగా మలుచుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో క్షీణించిన రక్షణ వ్యవస్థ, టీఎంసీ ప్రభుత్వ అక్రమాలు, ధరల పెరుగుదల, నిధుల నిలిపివేతపై అధికార పార్టీని ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. కేంద్రం నుంచి బెంగాల్కు రావాల్సిన రూ.2 లక్షల కోట్ల బకాయిల కోసం మమతా బెనర్జీ కేంద్ర దర్యాప్తు సంస్థల (ED, CBI) భయంతో పోరాడటం లేదని, ప్రజల హక్కులను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ నేరుగా విమర్శలు గుప్పిస్తుంది. అయితే గత లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, టీఎంసీ విడివిడిగానే పోటీ చేసినప్పటికీ, అప్పట్లో ఇంతటి తీవ్రస్థాయి ఘర్షణ వాతావరణం ఈ పార్టీల మధ్య లేదని చెబుతున్నారు. కానీ ఈసారి మమత ఓటు బ్యాంకును చీల్చేలా కాంగ్రెస్ వేస్తున్న పదునైన వ్యూహాలు, భవిష్యత్తులో ‘ఇండియా’ కూటమి మనుగడపై, ఇరు పార్టీల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
READ ALSO: Chanakya Niti : మీ తలరాతను మార్చే చాణక్యుడి మాటలు.. దరిద్రం దాటి దర్జాగా బతకండి ఇలా!
తాజావార్తలు
-
Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్కు రెడీగా ఉండండి!
-
Raaka : ‘రాకా’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
-
CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
-
Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
-
NALSAR: “CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం”.. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!