West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal Elections 2026: వెస్ట్ బెంగాల్లో ఇటీవల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. మే 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇంతలో గురువారం రాత్రి ఒక్కసారిగా హైడ్రామా చోటు చేసుకుంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఆరోపణలు చేయడంతో కోల్కతా వీధులు రణరంగంగా మారాయి. కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియం వెలుపల టీఎంసీ దిగ్గజ నేతలు డాక్టర్ శశి పంజా, కునాల్ ఘోష్ కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. స్ట్రాంగ్ రూమ్ లోపల ఉన్న బ్యాలెట్ బాక్సులతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు గందరగోళం సృష్టిస్తున్నారంటూ ఓ సీసీటీవీ ఫుటేజీని టీఎంసీ విడుదల చేయడంతో ఉద్రిక్తత మొదలైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. సఖావత్ మెమోరియల్ స్కూల్లోని స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్న ఆమె, గంటల తరబడి అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు సైతం అక్కడికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఒక్కసారిగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీదీ అక్కడి నుంచి వెళ్లే వరకు తాము కూడా కదలబోమని బీజేపీ నేతలు భీష్మించుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతి కష్టం మీద ఇరు వర్గాలను శాంతింపజేశారు.
Also Read
- టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
ఇక, టీఎంసీ విడుదల చేసిన వీడియో, ఆరోపణలను ఎన్నికల కమిషన్ (EC) కొట్టి పారేసింది. టీఎంసీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, అక్కడ బ్యాలెట్ బాక్సుల ట్యాంపరింగ్ జరగడం లేదని స్పష్టం చేసింది. నిజానికి పోస్టల్ బ్యాలెట్ల వర్గీకరణ (Sorting) ప్రక్రియ జరుగుతోందని, ఈ విషయంపై ముందే అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చామని కమిషన్ తెలిపింది. ఖుదీరామ్ అనుశీలన్ కేంద్రంలోని 7 స్ట్రాంగ్ రూమ్లు భద్రంగా, సీల్ వేసి ఉన్నాయని, కేవలం పక్క గదిలో పోస్టల్ బ్యాలెట్ల పని జరుగుతుండటంతో టీఎంసీ నేతలు భ్రమపడ్డారని వివరణ ఇచ్చింది.
ఈ పరిణామంతో ఒక్కసారిగా రాష్ట్రంలో అలజడులు చోటు చేసుకున్నాయి. కేవలం కోల్కతాలోనే కాకుండా దుర్గాపూర్లోనూ వాతావరణం వేడెక్కింది. స్ట్రాంగ్ రూమ్కు 200 మీటర్ల దూరంలోనే సుమారు 100 మంది టీఎంసీ కార్యకర్తలు షిఫ్టుల వారీగా పహారా కాస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా వారు డేరాలు వేసుకుని కూర్చున్నారు. ఇటు మానిక్తలాలో బీజేపీ అభ్యర్థి తాపస్ రాయ్ పోలీసులతో వాగ్వాదానికి దిగగా, విపక్ష నేత సువేందు అధికారి సైతం అక్కడికి వచ్చే అవకాశం ఉండటంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇక, ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా, మమతా బెనర్జీ త్వరలో దుర్గాపూర్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉండటంతో బెంగాల్ రాజకీయాలు ఫలితాలకు ముందే మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు కౌంటింగ్ వరకు నిఘా విషయంలో రాజీ పడేది లేదని టీఎంసీ తెగేసి చెబుతోంది.
తాజావార్తలు
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!