West Bengal: బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేపై దాడి.. రక్తం కళ్ల జూసిన నిరసనకారులు..
West Bengal: ఉత్తర బెంగాల్లోని నాగరకటలో వరద బాధితులకు సహాయం చేయడానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్, ఎంపీ ఖాగెన్ ముర్ముపై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బీజేపీ నాయకులు స్థానిక ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కుట్రగా బీజేపీ అభివర్ణిస్తోంది. ఈ ఘటన జల్పాయీగూడీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది.
READ MORE: Vijay Deverakonda: మొన్ననే ఎంగేజ్మెంట్.. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ దేవరకొండ..!
Also Read
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
స్థానికుల కథనం ప్రకారం.. ఇటీవల భారీ వర్షాలు, వరదలకు కొండచరియలు విరిగిపడటంతో జల్పైగురి ప్రాంతం అతలాకుతలమైంది. దీంతో సోమవారం నార్త్ మాల్దా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము, స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఘోష్, బీజేపీ ప్రతినిధుల బృందం వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించింది. బాధితులకు సహాయసామగ్రి పంపిణీ చేస్తున్నారు. కొందరు స్థానికులు వీరిపైకి రాళ్లు విసిరారు. ఈక్రమంలోనే ఖాగెన్ ముర్ము తలకు బలమైన దెబ్బలు తగిలి.. ధారాళంగా రక్తం కారింది. ఆయన ధరించిన కుర్తా సైతం రక్తంతో తడిసి ముద్దైంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున జనాలు మారణాయుధాలతో బీజేపీ నేతలపై దాడికి తెగబడినట్లు వీడియోలో రికార్డైంది. వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. వారిని బయపెట్టేందుకు ఎంపీ ఖాగెన్ ముర్ముపై రాళ్లు, చెప్పులు, కర్రలు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు.
విషయం గుర్తించిన పలువురు స్థానికులు, ఎంపీ వెంట ఉన్న నాయకులు.. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి ముందు బీజేపీ ప్రతినిధులను అడ్డుకునేందుకు 500 మందికిపైగా స్థానికులు రహదారులపై బైటాయించారు. ‘గో బ్యాక్’ అనే నినాదాలతో బీజేపీ బృందాన్ని అడ్డుకున్నారు. ఈ దాడిలో గాయపడిన ఎంపీ, ఎమ్మెల్యేలను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే.. ఈదాడిపై బీజేపీ స్పందించింది. పార్టీ నేత అమిత్ మాలవీయ ఎక్స్లో పోస్టు చేశారు. బెంగాల్లో తృణమూల్ ఆటవిక రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
BJP MP Khagen Murmu (Malda Uttar PC) and BJP MLA Shankar Ghosh (Siliguri AC) attacked in Nagrakata in Jalpaiguri.
This seems to be a case of public outrage against BJP leaders of North Bengal who prioritize accompanying LOP Suvendu Adhikari over attending to their areas. pic.twitter.com/Rf5vnPGdlK
— Sandipan Mitra (@SMitra_) October 6, 2025
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!