INDvsNZ ODI: రెండో వన్డేలో భారీ స్కోర్లు కష్టమే?..పిచ్ ఎలా ఉండబోతుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్తో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో కొద్దిలో ఓటమి నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకుంది టీమిండియా. భారీ స్కోర్ చేసినా బౌలర్ల వైఫల్యంతో చివరి వరకు గెలుపుపై పూర్తి ధీమా లేకపోయింది. కాగా నేడు జరగబోయే రెండో వన్డేలో అయినా కివీస్పై రోహిత్సేన పూర్తి ఆధిపత్యం వహించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాయ్పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత జట్టు చూస్తుండగా.. ఇందులోనైనా విజయం సాధించి సిరీస్ సమం చేయాలని న్యూజిలాండ్ ఉవ్విళ్లూరుతోంది.
Also Read : Woman Died Violently: ఓయూలో ఆత్మహత్య కలకలం.. బిల్డింగ్పై నుంచి దూకిన యువతి
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
రెండో మ్యాచ్ జరగబోయే షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో వర్షం పడే అవకాశం అయితే ఏమాత్రం లేదని తెలుస్తోంది. ప్రేక్షకులు పూర్తి 100 ఓవర్ల ఆటను ఆస్వాదించొచ్చు. మ్యాచ్ జరిగే సమయంలో 25 డిగ్రీల సెల్సియస్ నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉష్ణోగ్రత ఉంటుందని నిపుణుల అంచనా. అయితే సాయంత్రం తర్వాత మాత్రం మంచు ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగలేదు. ఇదే తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్. అయితే ఇక్కడ జరిగిన కొన్ని ఐపీఎల్ మ్యాచ్ల ఫలితాలను గమనిస్తే.. ఈ పిచ్ నుంచి పేసర్లకు, స్పిన్నర్లకు కూడా మంచి సహకారం లభిస్తుందని చెప్పవచ్చు.దీంతో ఈ మ్యాచ్లో స్కోర్లు 240-250 మధ్య ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్ తయారు చేస్తే మాత్రం ఉప్పల్ వన్డే మాదిరి భారీ స్కోర్లు ఆశించవచ్చు.
Also Read : Rashmi Gautham : రష్మీ గౌతమ్ ఇంట విషాదం..
కాగా, తొలి వన్డేలో విఫలమైన స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో సెంచరీలు బాదాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే ఉప్పల్లో డబుల్ సెంచరీతో మెరిసిన శుభ్మన్ గిల్పైనా మంచి అంచనాలున్నాయి. ఇషాన్ కిషన్, సూర్య, హార్దిక్ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఇక తొలి వన్డేలో విధ్వంసం సృష్టించిన న్యూజిలాండ్ బ్యాటర్ బ్రేస్వెల్తో భారత బౌలర్లు జాగ్రత్తగా ఉండాలి. మొదటి మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా కూడా కివీస్ బౌలర్లను తక్కువ అంచనా వేయలేం. ఫెర్గుసన్, శాంట్నర్, టిక్నెర్, షింప్లే, బ్రేస్వెల్లకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్ తీయగల సత్తా ఉంది.
తాజావార్తలు
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!