Nirmala Sitharaman: మీ నోళ్లు డెటాల్తో కడుక్కోండి భయ్యా.. కాంగ్రెస్పై సీతమ్మ వ్యంగాస్త్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: శుక్రవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కుటుంబ బంధానికి మేలు చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం యావత్ దేశాన్ని దృష్టిలో ఉంచుకునే విధానాలను రూపొందిస్తున్నందున బీజేపీ జిజాజీలు, భతీజాల పార్టీ కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక వ్యక్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం బడ్జెట్ను రూపొందించిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆర్థిక మంత్రి స్పందించారు. శుక్రవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఎవరినో దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేసినట్లు ప్రకటనలు ఇవ్వడం తప్పు అని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో తాము నిధుల కేటాయింపులో ఏ ఒక్కరినీ కాకుండా మొత్తం దేశాన్ని దృష్టిలో ఉంచుకున్నామన్నారు.
TikTok Layoff: భారత దేశంలోని తన సిబ్బందిని తొలగించిన టిక్ టాక్
Also Read
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
కేంద్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ఎంపీలపై ఆమె ఘాటుగా స్పందించారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మీరు మీ నోళ్లను డెటాల్తో శుభ్రం చేసుకోండి భయ్యా.. ఒకవేళ అలా చేసినా మీ నోళ్లు శుభ్రం కావు అంటూ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలను సంధించారు. హిమాచల్లో సర్కారును ఏర్పాటు చేసిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే పెట్రోల్ ధరలపై వ్యాట్ పెంచేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. దీంతో అక్కడ ఇంధన ధరలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ సంప్రదాయం ఇదేనని, ఆరోపణలు చేసి సభ నుంచి వాకౌట్ చేస్తారని.. అంతేగానీ ఎవరి మాట వినరంటూ నిర్మలా సీతారామన్ ఆరోపించారు. లోక్సభలో చర్చ సందర్భంగా అశోక్ గెహ్లాట్ బడ్జెట్ ప్రసంగంలో తప్పుల గురించి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. రాజస్థాన్ కష్టాల్లో ఉందని.. తప్పులు ఎవరైనా చేస్తారు.. కానీ గతేడాది చదవాల్సిన ఎవరికీ రాకుండా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!