Nirmala Sitharaman: మీ నోళ్లు డెటాల్తో కడుక్కోండి భయ్యా.. కాంగ్రెస్పై సీతమ్మ వ్యంగాస్త్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: శుక్రవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కుటుంబ బంధానికి మేలు చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం యావత్ దేశాన్ని దృష్టిలో ఉంచుకునే విధానాలను రూపొందిస్తున్నందున బీజేపీ జిజాజీలు, భతీజాల పార్టీ కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక వ్యక్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం బడ్జెట్ను రూపొందించిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆర్థిక మంత్రి స్పందించారు. శుక్రవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఎవరినో దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేసినట్లు ప్రకటనలు ఇవ్వడం తప్పు అని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో తాము నిధుల కేటాయింపులో ఏ ఒక్కరినీ కాకుండా మొత్తం దేశాన్ని దృష్టిలో ఉంచుకున్నామన్నారు.
TikTok Layoff: భారత దేశంలోని తన సిబ్బందిని తొలగించిన టిక్ టాక్
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
కేంద్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ఎంపీలపై ఆమె ఘాటుగా స్పందించారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మీరు మీ నోళ్లను డెటాల్తో శుభ్రం చేసుకోండి భయ్యా.. ఒకవేళ అలా చేసినా మీ నోళ్లు శుభ్రం కావు అంటూ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలను సంధించారు. హిమాచల్లో సర్కారును ఏర్పాటు చేసిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే పెట్రోల్ ధరలపై వ్యాట్ పెంచేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. దీంతో అక్కడ ఇంధన ధరలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ సంప్రదాయం ఇదేనని, ఆరోపణలు చేసి సభ నుంచి వాకౌట్ చేస్తారని.. అంతేగానీ ఎవరి మాట వినరంటూ నిర్మలా సీతారామన్ ఆరోపించారు. లోక్సభలో చర్చ సందర్భంగా అశోక్ గెహ్లాట్ బడ్జెట్ ప్రసంగంలో తప్పుల గురించి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. రాజస్థాన్ కష్టాల్లో ఉందని.. తప్పులు ఎవరైనా చేస్తారు.. కానీ గతేడాది చదవాల్సిన ఎవరికీ రాకుండా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!