Off The Record: కుతకుతలాడుతున్న అనంతపురం అర్బన్ పాలిటిక్స్..
- కుతకుతలాడుతున్న అనంతపురం అర్బన్ పాలిటిక్స్
- దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అయ్యాక మారిపోయిన వాతావరణం
- ఎమ్మెల్యే, మేయర్ మధ్య మాటల యుద్ధం
- అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ పాలక మండలి
- ఏ పని చేయాలన్నా ఒకరు ఔనంటే మరొకరు కాదంటారు
- వైసీపీ హయాంలో తీవ్ర అవినీతి జరిగిందని ఎమ్మెల్యే ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కువ మాట్లాడితే నీ పదవి ఊడుతుందని ఒకరు, నువ్వు ఊ…… అంటే ఊడిపోవడానికి అదేమీ నీ మనుషులు తయారు చేసిన కుర్చీ కాదు, ప్రజలిచ్చిన పోస్ట్ అని మరొకరు సవాళ్ళతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. వస్తా… సంగతేంటో చూస్తానని ఒకరు, రా… చూద్దాం…. అయామ్ వెయిటింగ్ అంటూ ఇంకొకరు సినిమా డైలాగ్స్తో యవ్వారాన్ని యమా రక్తి కట్టిస్తున్నారు. ఆచరణ సాధ్యంకాని ఆ సవాళ్ళు విసురుకుంటున్న ఇద్దరూ ఎవరు? వాతావరణం ఎందుకంత వేడెక్కింది?
Also Read:Botsa Satyanarayana : చంద్రబాబు కేసుల ఉపసంహరణ చట్ట విరుద్ధం
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
అనంతపురం అర్బన్ నియోజకవర్గ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంతగా కుతకుత ఉడికిపోతున్నాయి. గడిచిన మూడు దశాబ్దాలుగా ఇక్కడి పాలిటిక్స్ని పరిశీలిస్తే…. ఎన్నికల సమయంలో తప్ప మిగతా టైంలో ఎవరి పని వాళ్ళదే. గెలుపోటములతో సంబంధం లేకుండా అనంత నేతలు కాస్త సంయమనం పాటిస్తుంటారు. కానీ…. 2024 ఎన్నికలకు ముందు నుంచి ఇక్కడి రాజకీయ వాతావరణం పూర్తిస్థాయిలో మారిపోయింది. అనూహ్యంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ తరపున అర్బన్ టికెట్ సాధించారు. జిల్లా వైసీపీలో అందరికంటే సీనియర్ అయిన అనంత వెంకటరామిరెడ్డి మీద పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి టిడిపిలో అంతర్గత కలహాలు ఓవైపు.. టిడిపి వర్సెస్ వైసీపీగా సాగుతున్న పోరు మరోవైపు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెంచేశాయి.
ప్రత్యేకించి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మేయర్ వసీం మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధం ఉద్రిక్తతలు పెంచుతోంది. వీరిద్దరి మధ్య గొడవలకు ప్రధానమైన కారణం అనంతపురం నగరపాలక సంస్థలో వైసీపీ పాలకవర్గం ఉండటమే. ఓవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ఇంకోవైపు వైసీపీ మేయర్ ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు విషయంలో ప్రతిసారి పేచీ వస్తోంది. ఏ పని చేయాలన్నా ఒకరు ఔను అంటే ఇంకొకరు కాదంటూ మోకాలడ్డుతున్నారు. అలా ప్రతి సందర్భంలోనూ… నాయకుల మధ్య మాటా మాటా పెరుగుతోంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నా.. అక్కడ వైసీపీని కౌంటర్ చేస్తుంటారు. అదే ఊపులో… కొన్ని సందర్భాల్లో మేయర్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం వివాదానికి కారణమవుతోంది.
గత ఐదేళ్లలో ఒక చిన్న డ్రైనేజీ కట్టలేదు, ఒక రోడ్డు కూడా వేయలేదంటూ ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే. గత వైసిపి ప్రభుత్వ హయాంలో నగరపాలక సంస్థలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు దగ్గుపాటి. మున్సిపల్ కార్మికులకు పంపిణీ చేసే పనిముట్ల నుంచి కుక్కలు పట్టుకునే వరకు… ప్రతి అంశంలోనూ అవినీతి జరిగిందన్నది ఎమ్మెల్యే మాట. మేయర్ మొత్తం నగరాన్నే కాకుండా…. చివరికి తన సొంత డివిజన్ని కూడా నిర్లక్ష్యం చేశారని, ఇక అభివృద్ధి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు శాసనసభ్యుడు దగ్గుపాటి. అయితే దీనికి కౌంటర్గా… తాను తన డివిజన్లోనే రెండు కోట్ల 40 లక్షల రూపాయలు పనులు చేపట్టానని…. కానీ, రాష్ట్రంలో అధికారం మారి కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిలో కొన్ని పనుల్ని ఆపేశారని చెబుతున్నారు మేయర్.
Also Read:Imran Khan: “మరణం” వార్తలకు చెక్.. ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు సోదరికి అనుమతి..
అయితే… ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదని, తాను అనుకుంటే పదవి ఊడిపోతుందంటూ మేయర్కు వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. ఆ తర్వాత దీనికి మేయర్ వసీం కూడా చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. మేయర్ పదవి అంటే ఎమ్మెల్యే నియమించింది కాదని, ఆయన ఊడగొడతానంటే ఊడిపోవడానికి కేవలం కుర్చీ కాదని, 48 మంది కార్పొరేటర్ల మద్దతుతో వచ్చిన స్థానమని సీరియస్ అయ్యారు. ఇలా… క్రమంగా ఎమ్మెల్యే, మేయర్ మధ్య మాట మాట పెరిగిపోతూ చలికాలంలో కూడా సెగలు పుడుతున్నాయి. ఈ సెగలు ఇప్పట్లో చల్లారేలా కూడా కనిపించడం లేదన్నది స్థానికంగా ఈ వ్యవహారాలను పరిశీలిస్తున్నవాళ్ళ మాట. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు నో కాంప్రమైజ్ అంటుండటంతో… ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటు వెళ్తాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
తాజావార్తలు
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!