Head Coach: గౌతమ్ గంభీర్కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ నియంత్రణ మండలి జింబాబ్వే పర్యటనకు వెళ్లే 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించిన తర్వాత.. తాజాగా టీమ్ కోచింగ్ స్టాఫ్కు సంబంధించిన ఒక కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. జింబాబ్వే పర్యటనకు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెళ్లడం లేదు. ఆయన స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అధిపతిగా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్గా బాధ్యతలు వహించనున్నారు.
బిజీ షెడ్యూల్ వల్లే ఈ నిర్ణయం..
భారత జట్టు రాబోయే రోజుల్లో వరుస అంతర్జాతీయ సిరీస్లతో బిజీగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ భారత జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారు. ఈ సిరీస్ ముగిసిన కొద్ది రోజులకే జూలై 23 నుంచి జింబాబ్వే పర్యటన ప్రారంభం కానుంది. గంభీర్కు విశ్రాంతినిస్తూ, పనిభారాన్ని తగ్గించేందుకు గానూ ఈ పర్యటన బాధ్యతలను లక్ష్మణ్కు అప్పగించారు.
Also Read
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
జింబాబ్వే పర్యటనతో పాటు ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 లో కూడా భారత జట్టుకు లక్ష్మణ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తారు. అదే సమయంలో వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనుంది. రెండు సిరీస్లు ఒకేసారి జరగడం వల్ల గంభీర్ సీనియర్ జట్టుతో కలిసి వెస్టిండీస్ సిరీస్లో ఉంటారు, లక్ష్మణ్ ఏషియన్ గేమ్స్ జట్టును నడిపిస్తారు.
VVS Laxman to Head Coach team India for the Zimbabwe tour and Asian Games. (Gaurav Gupta). pic.twitter.com/YfGkHh0Ngt
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2026
సపోర్ట్ స్టాఫ్లో మరికొంతమంది..
వీవీఎస్ లక్ష్మణ్తో పాటు సపోర్ట్ స్టాఫ్లో మరో ఇద్దరు మాజీ భారత ఆటగాళ్లకు చోటు లభించింది. మాజీ క్రికెటర్ కనిత్కర్ బ్యాటింగ్ కోచ్గా, మాజీ స్పిన్నర్ సునీల్ జోషి బౌలింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ కోచింగ్ త్రయం జింబాబ్వే సిరీస్, ఏషియన్ గేమ్స్ తర్వాత బంగ్లాదేశ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లోనూ కొనసాగే అవకాశం ఉంది.
గౌతమ్ గంభీర్ కోచింగ్ లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 వరల్డ్ కప్ 2026 వంటి పెద్ద టోర్నీలను గెలిచినప్పటికీ, ఇటీవల ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ చేతుల్లో ఎదురైన పరాజయాల నేపథ్యంలో రాబోయే సిరీస్లు భారత జట్టుకు ఎంతో కీలకంగా మారాయి.
తాజావార్తలు
-
BeiGo X4: 100KM రేంజ్తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్ప్రీత్ సంతోషం!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!