మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయినప్పటికీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల వల్ల విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. గతంలో విడుదలైన టీజర్పై కొన్ని మిశ్రమ స్పందనలు రావడంతో, చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా సీజీ వర్క్ను మళ్ళీ రీ-వర్క్ చేయిస్తోంది. అయితే తాజాగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత ధీరజ్ మొగిలినేని ‘విశ్వంభర’ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
Also Read : Rashmika : బాలీవుడ్లో రష్మిక కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
“విశ్వంభర థియేట్రికల్ ట్రైలర్ నేను చూశాను, అది ఇప్పటికే సిద్ధంగా ఉంది. టీజర్లో చూసిన విజువల్స్కు, ఇప్పుడు రెడీ అయిన ట్రైలర్కు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. కచ్చితంగా ఇది ప్రేక్షకులకు సరికొత్త హై ఇస్తుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంటే టీజర్ నిరాశపరిచిన నేపథ్యంలో, ఈ ట్రైలర్తోనే సినిమాపై భారీ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలని దర్శకుడు వశిష్ఠ, నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ భావిస్తోంది. వారు చెప్పినట్లుగా ట్రైలర్ కనుక ప్రేక్షకులకు నచ్చితే సినిమా బిజినెస్ డీల్స్ కూడా రికార్డ్ స్థాయిలో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.