టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక సంచలనం. ఆయన సినిమా వస్తుందంటే చాలు అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రస్తుతం చిరంజీవి యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara) పై భారీ హైప్ ఉంది.చిరంజీవి క్లాసిక్ హిట్స్ అయిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లోని అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్, వినోదం.. అలాగే ‘హిట్లర్’ సినిమాలో ఉండే అన్న-చెల్లెళ్ల సెంటిమెంట్.. ఈ రెండు షేడ్స్ ‘విశ్వంభర’లో హైలైట్గా నిలవనున్నాయి. సృష్టి, స్థితి, లయ అనే అంశాల చుట్టూ తిరిగే ఈ కథలో చిరంజీవి విశ్వంభరుడుగా కనిపించబోతున్నారు.అయితే, రీసెంట్గా విడుదలైన టీజర్లోని గ్రాఫిక్స్ (VFX) పట్ల మెగా అభిమానుల్లో కొన్ని అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారు? సినిమా అసలు కథేంటి? అనే విషయాలపై తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది.
Also Read : Paradise :‘పారడైజ్’ కోసం కలెక్షన్ కింగ్ రెమ్యూనరేషన్ వైరల్
తాజాగా జరిగిన ఒక సినిమా ఈవెంట్లో యూవీ క్రియేషన్స్ ప్రతినిధి అజయ్ కుమార్ మాట్లాడుతూ ‘విశ్వంభర’ గ్రాఫిక్స్పై వస్తున్న కామెంట్స్కు క్లారిటీ ఇచ్చారు. “టీజర్లోని విజువల్స్ విషయంలో వచ్చిన ఫీడ్బ్యాక్ను మేము గమనించాం. ఒక పెద్ద సినిమాను రూపొందిస్తున్నప్పుడు ఇలాంటివి సహజం. అందుకే, రెండో టీజర్లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా పటిష్టంగా, నెక్స్ట్ లెవల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. విఎఫ్ఎక్స్ నాణ్యత కోసం కొంచెం ఎక్కువ సమయం పడుతోంది” అని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల రెండో టీజర్ మెగా ఫ్యాన్స్కు ఒక విజువల్ ఫీస్ట్లా ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ సినిమా కేవలం గ్రాఫిక్స్ మీద మాత్రమే కాకుండా స్ట్రాంగ్ ఎమోషన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుందని సమాచారం.