Virender Sehwag Divorce: సతీమణి ఆర్తితో సెహ్వాగ్ విడాకులు.. ఇదిగో ప్రూఫ్!
- సతీమణి ఆర్తితో సెహ్వాగ్ విడాకులు
- దీపావళి పండుగ నేపథ్యంలో సెహ్వాగ్ పోస్ట్
- సెహ్వాగ్, ఆర్తి సంసారంలోకి మరో వ్యక్తి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తన సతీమణి ఆర్తి అహ్లవత్కు విడాకులు ఇచ్చాడని కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సెహ్వాగ్, ఆర్తిలు గత రెండేళ్లుగా విడిగా ఉంటున్నారని.. 20 ఏళ్ల వైవాహిక బంధానికి ఇద్దరూ ఇప్పటికే స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. విడాకుల వ్యవహారంపై అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే 2025 దీపావళి పండుగ నేపథ్యంలో సెహ్వాగ్ చేసిన పోస్ట్.. ఆర్తితో విడాకులు నిజమే అని స్పష్టం చేస్తోంది.
దీపావళి సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ తన ఎక్స్ ఖాతాలో ఫొటోస్ పోస్ట్ చేసి.. ఓ సంస్కృత శ్లోకాన్ని క్యాప్షన్గా పేర్కొన్నారు. ఒక ఫొటోలో సెహ్వాగ్ ఒక్కడే ఉండగా.. మరో ఫొటోలో వీరూ తల్లితో పాటు అతడి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ‘నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మెరుపును వదిలి వెళ్ళు. దీపావళి శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. ‘దీప్జ్యోతిః పరమం బ్రహ్మం దీప్జ్యోతిర్జనార్దన్ః । దీపో హర్తు మే పాం దీప్జ్యోతిర్నమోస్తుతే ॥’ అని సంస్కృత శ్లోకాన్ని కూడా పోస్ట్ చేశారు. వీరూ పోస్ట్ చేసిన ఫోటోలలో సతీమణి ఆర్తి అహ్లవత్ లేదు. దాంతో ‘విడాకులు నిజమే’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- 8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
Also Read: Palanadu News: చనిపోయి మూడు రోజులైనా.. తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేయని కుమారులు!
2004 డిసెంబరులో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్లు వివాహం చేసుకున్నారు. వీరికి కుమారులు ఆర్యవీర్ (2007), వేదాంత్ (2010) ఉన్నారు. 20 ఏళ్ల పాటు సజావుగా సాగిన వీరూ, ఆర్తిల వైవాహిక జీవితంలో 2-3 ఏళ్ల కిందట మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఇద్దరు విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. గతేడాది దీపావళి సందర్బంగా సెహ్వాగ్ తన కుమారులు, తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేయడంతో విడాకుల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవల ఇద్దరూ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పుడు దీపావళి సందర్భంగా మరోసారి రుజువైంది. విడాకులపై అటు సెహ్వాగ్, ఇటు ఆర్తి ఇప్పటివరకు స్పందించలేదు. బీసీసీఐలో కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఆర్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసే ఆర్తిని వీరూ దూరం పెట్టాడట. ఇక భారత్ తరఫున సెహ్వాగ్ 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడారు.
తాజావార్తలు
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!