Virender Sehwag Divorce: సతీమణి ఆర్తితో సెహ్వాగ్ విడాకులు.. ఇదిగో ప్రూఫ్!
- సతీమణి ఆర్తితో సెహ్వాగ్ విడాకులు
- దీపావళి పండుగ నేపథ్యంలో సెహ్వాగ్ పోస్ట్
- సెహ్వాగ్, ఆర్తి సంసారంలోకి మరో వ్యక్తి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తన సతీమణి ఆర్తి అహ్లవత్కు విడాకులు ఇచ్చాడని కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సెహ్వాగ్, ఆర్తిలు గత రెండేళ్లుగా విడిగా ఉంటున్నారని.. 20 ఏళ్ల వైవాహిక బంధానికి ఇద్దరూ ఇప్పటికే స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. విడాకుల వ్యవహారంపై అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే 2025 దీపావళి పండుగ నేపథ్యంలో సెహ్వాగ్ చేసిన పోస్ట్.. ఆర్తితో విడాకులు నిజమే అని స్పష్టం చేస్తోంది.
దీపావళి సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ తన ఎక్స్ ఖాతాలో ఫొటోస్ పోస్ట్ చేసి.. ఓ సంస్కృత శ్లోకాన్ని క్యాప్షన్గా పేర్కొన్నారు. ఒక ఫొటోలో సెహ్వాగ్ ఒక్కడే ఉండగా.. మరో ఫొటోలో వీరూ తల్లితో పాటు అతడి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ‘నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మెరుపును వదిలి వెళ్ళు. దీపావళి శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. ‘దీప్జ్యోతిః పరమం బ్రహ్మం దీప్జ్యోతిర్జనార్దన్ః । దీపో హర్తు మే పాం దీప్జ్యోతిర్నమోస్తుతే ॥’ అని సంస్కృత శ్లోకాన్ని కూడా పోస్ట్ చేశారు. వీరూ పోస్ట్ చేసిన ఫోటోలలో సతీమణి ఆర్తి అహ్లవత్ లేదు. దాంతో ‘విడాకులు నిజమే’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
Also Read: Palanadu News: చనిపోయి మూడు రోజులైనా.. తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేయని కుమారులు!
2004 డిసెంబరులో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్లు వివాహం చేసుకున్నారు. వీరికి కుమారులు ఆర్యవీర్ (2007), వేదాంత్ (2010) ఉన్నారు. 20 ఏళ్ల పాటు సజావుగా సాగిన వీరూ, ఆర్తిల వైవాహిక జీవితంలో 2-3 ఏళ్ల కిందట మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఇద్దరు విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. గతేడాది దీపావళి సందర్బంగా సెహ్వాగ్ తన కుమారులు, తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేయడంతో విడాకుల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవల ఇద్దరూ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పుడు దీపావళి సందర్భంగా మరోసారి రుజువైంది. విడాకులపై అటు సెహ్వాగ్, ఇటు ఆర్తి ఇప్పటివరకు స్పందించలేదు. బీసీసీఐలో కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఆర్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసే ఆర్తిని వీరూ దూరం పెట్టాడట. ఇక భారత్ తరఫున సెహ్వాగ్ 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడారు.
తాజావార్తలు
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్కు సపోర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!