Virat Kohli: వన్డే కెరీర్లో కోహ్లీ 45వ సెంచరీ పూర్తి.. సచిన్ రికార్డు సమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీని ఫుల్ ఫాంలో చూడటం కంటే మెరుగైన దృశ్యం ఏదైనా ఉందా? గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలోని అభిమానులు భారత మాజీ కెప్టెన్ను కింగ్ అంటూ అరుపులతో తమ అభిమానాన్ని చాటారు. మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కోహ్లి 80 బంతుల్లోనే 45వ వన్డే శతకాన్ని సాధించాడు. మూడు ఫార్మాట్లలో ఇది కింగ్ కోహ్లీకి 73వ అంతర్జాతీయ సెంచరీ. టెస్టుల్లో 27, టీ20ల్లో ఒక సెంచరీ సాధించాడు. అస్సాం వేదికగా జరిగిన మ్యాచ్లో కోహ్లీ 10 ఫోర్లు, ఒక సిక్సర్తో శతకాన్ని సాధించగలిగాడు.
ఈ టోర్నీతో విరాట్ కోహ్లీ స్వదేశంలో 20 వన్డే సెంచరీలు సాధించాడు. కోహ్లీ స్వదేశంలో 20 సెంచరీలు చేసిన బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఈ ఫీట్ను సాధించాడు. తన 73వ అంతర్జాతీయ శతకాన్ని సాధించిన కోహ్లి 257 ఇన్నింగ్స్లలో 12500 వన్డేల్లో వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెండూల్కర్ను అధిగమించి కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. తన 45వ వన్డే సెంచరీతో కోహ్లి ఇప్పుడు శ్రీలంకపై తొమ్మిది సెంచరీలు చేశాడు. ద్వీపవాసులపై భారత బ్యాటర్ చేసిన అత్యధిక శతకాలు ఇవే కావడం గమనార్హం. తొలి వన్డేకు ముందు కోహ్లీ, టెండూల్కర్లు ఈ రికార్డును సంయుక్తంగా కలిగి ఉన్నారు. టెండూల్కర్, కోహ్లీ కూడా ఆస్ట్రేలియాపై వెస్టిండీస్లపై వరుసగా తొమ్మిది సెంచరీలు సాధించారు.
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
SA T20 League: నేటి నుంచి సఫారీ లీగ్.. ఐపీఎల్ తరహాలో ఆదరణ ఉండేనా?
శ్రీలంకపై తొలివన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70) భారత్కు శుభారంభం అందించగా, 20వ ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి శతక్కొట్టాడు. విరాట్ శ్రీలంక కెప్టెన్ దసున్ షనక వేసిన 22వ ఓవర్లో తన మొదటి బౌండరీని కొట్టాడు. అక్కడి నుంచి కోహ్లీకి రెండు అవకాశాలు లభించాయి. కోహ్లీ 47 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన తర్వాత, 37వ ఓవర్లో కసున్ రజిత బౌలింగ్లో వికెట్ కీపర్ కుసాల్ మెండిస్ క్యాచ్ డ్రాప్ చేశాడు. మళ్లీ 43వ ఓవర్లో రజిత బౌలింగ్లో లంక ఆటగాళ్లు మరోసారి కోహ్లీ క్యాచ్ను డ్రాప్ చేశారు. ఈసారి అతను 81 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షనక కోహ్లీ క్యాచ్ను డ్రాప్ చేశాడు. 87 బంతులు ఆడి 113 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మెండిస్ బౌలింగ్లో వెనుదిరిగాడు
ఇదిలా ఉండగా శ్రీలంక ఎదుట భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 373 పరుగులు చేసింది. శ్రీలంక 374 పరుగులు చేయాల్సి ఉంది. మంచి ఊపుమీదున్న భారత్పై గెలవడం శ్రీలంకకు కష్టమని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!