Virat Kohli: వన్డే కెరీర్లో కోహ్లీ 45వ సెంచరీ పూర్తి.. సచిన్ రికార్డు సమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీని ఫుల్ ఫాంలో చూడటం కంటే మెరుగైన దృశ్యం ఏదైనా ఉందా? గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలోని అభిమానులు భారత మాజీ కెప్టెన్ను కింగ్ అంటూ అరుపులతో తమ అభిమానాన్ని చాటారు. మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కోహ్లి 80 బంతుల్లోనే 45వ వన్డే శతకాన్ని సాధించాడు. మూడు ఫార్మాట్లలో ఇది కింగ్ కోహ్లీకి 73వ అంతర్జాతీయ సెంచరీ. టెస్టుల్లో 27, టీ20ల్లో ఒక సెంచరీ సాధించాడు. అస్సాం వేదికగా జరిగిన మ్యాచ్లో కోహ్లీ 10 ఫోర్లు, ఒక సిక్సర్తో శతకాన్ని సాధించగలిగాడు.
ఈ టోర్నీతో విరాట్ కోహ్లీ స్వదేశంలో 20 వన్డే సెంచరీలు సాధించాడు. కోహ్లీ స్వదేశంలో 20 సెంచరీలు చేసిన బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఈ ఫీట్ను సాధించాడు. తన 73వ అంతర్జాతీయ శతకాన్ని సాధించిన కోహ్లి 257 ఇన్నింగ్స్లలో 12500 వన్డేల్లో వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెండూల్కర్ను అధిగమించి కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. తన 45వ వన్డే సెంచరీతో కోహ్లి ఇప్పుడు శ్రీలంకపై తొమ్మిది సెంచరీలు చేశాడు. ద్వీపవాసులపై భారత బ్యాటర్ చేసిన అత్యధిక శతకాలు ఇవే కావడం గమనార్హం. తొలి వన్డేకు ముందు కోహ్లీ, టెండూల్కర్లు ఈ రికార్డును సంయుక్తంగా కలిగి ఉన్నారు. టెండూల్కర్, కోహ్లీ కూడా ఆస్ట్రేలియాపై వెస్టిండీస్లపై వరుసగా తొమ్మిది సెంచరీలు సాధించారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
SA T20 League: నేటి నుంచి సఫారీ లీగ్.. ఐపీఎల్ తరహాలో ఆదరణ ఉండేనా?
శ్రీలంకపై తొలివన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70) భారత్కు శుభారంభం అందించగా, 20వ ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి శతక్కొట్టాడు. విరాట్ శ్రీలంక కెప్టెన్ దసున్ షనక వేసిన 22వ ఓవర్లో తన మొదటి బౌండరీని కొట్టాడు. అక్కడి నుంచి కోహ్లీకి రెండు అవకాశాలు లభించాయి. కోహ్లీ 47 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన తర్వాత, 37వ ఓవర్లో కసున్ రజిత బౌలింగ్లో వికెట్ కీపర్ కుసాల్ మెండిస్ క్యాచ్ డ్రాప్ చేశాడు. మళ్లీ 43వ ఓవర్లో రజిత బౌలింగ్లో లంక ఆటగాళ్లు మరోసారి కోహ్లీ క్యాచ్ను డ్రాప్ చేశారు. ఈసారి అతను 81 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షనక కోహ్లీ క్యాచ్ను డ్రాప్ చేశాడు. 87 బంతులు ఆడి 113 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మెండిస్ బౌలింగ్లో వెనుదిరిగాడు
ఇదిలా ఉండగా శ్రీలంక ఎదుట భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 373 పరుగులు చేసింది. శ్రీలంక 374 పరుగులు చేయాల్సి ఉంది. మంచి ఊపుమీదున్న భారత్పై గెలవడం శ్రీలంకకు కష్టమని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..