IND vs AUS: విరాట్ కోహ్లీకి గాయం..! అభిమానుల్లో టెన్షన్
- ఈనెల 6 నుంచి అడిలైడ్లో పింక్ బాల్ టెస్ట్
- తొలి టెస్టులో గెలిచిన టీమిండియా
- రెండో టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియాకు షాక్
- స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మోకాలికి గాయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 6 నుంచి అడిలైడ్లో పింక్ బాల్ టెస్ట్ మొదలు కానుంది. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. ఈ టెస్టులోనూ విక్టరీ సాధించాలని చూస్తోంది. అయితే.. ఈ టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మోకాలికి గాయమైంది. అతను వైద్య సహాయం కోరుతూ వీడియోలో కనిపించాడు. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందతున్నారు. ప్రాక్టీస్ సెషన్కు సంబంధంచి ఒక వీడియో బయటికొచ్చింది. అందులో.. జట్టు వైద్య సిబ్బంది కోహ్లీ కుడి మోకాలికి బ్యాండేజ్ చేయడం కనిపించింది.
Read Also: Vitamin ‘D’ Deficiency: ‘విటమిన్ డి’ లోపం ఉంటే ఇవి తినండి.. మళ్లీ సమస్య రాదు..
Also Read
- Madras High Court: దేవుడి ముందు అందరూ సమానమే.. VIP దర్శనాలు ఎందుకు?
- Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
- Rocket Explosion: బ్లూ ఆరిజిన్కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
- AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
ఈ వీడియోలో కోహ్లీ మోకాలికి కట్టు కట్టుకుని ఉన్నాడు. కాగా.. మెళ్లిమెళ్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్లినట్లు కనిపించింది. అయితే, కోహ్లీ నడిచిన తీరు చూస్తే పెద్ద గాయమైనట్లు ఏమీ ఉండదని తెలుస్తోంది. కోహ్లీ గాయం ఎంత తీవ్రంగా ఉందో ప్రస్తుతానికి ఏమీ తెలియనప్పటికీ, అతను పూర్తిగా ఫిట్గా తిరిగి మైదానంలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కోహ్లీ ఫామ్ భారత్కు చాలా కీలకం కానుంది. పెర్త్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పేలవ ప్రదర్శన కనబరచగా.. రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా.. భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్లో కంగారూ జట్టును 294 పరుగుల తేడాతో ఓడించింది.
Read Also: Nissan Magnite SUV: ఇండియాలో భారీగా అమ్ముడవుతున్న నిస్సాన్ మాగ్నైట్.. లక్షల్లో యూనిట్లు సేల్
పెర్త్ టెస్ట్లో సెంచరీ చేసి కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. మరోవైపు.. రెండో టెస్టులో కోహ్లీ మరో 23 పరుగులు సాధిస్తే.. డే/నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్ను అందుకున్న తొలి భారత ప్లేయర్గా కోహ్లి ఘనత సాధిస్తాడు. 102 పరుగులు సాధిస్తే అడిలైడ్ వేదికలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్గా లారా రికార్డును కోహ్లి అధిగమిస్తాడు.
తాజావార్తలు
-
Madras High Court: దేవుడి ముందు అందరూ సమానమే.. VIP దర్శనాలు ఎందుకు?
-
LIC Shares: ఎల్ఐసీ షేర్స్ లో భారీ పతనం.. రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్.. అసలు కారణం ఇదే!
-
Peddi : బెజవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. సెలబ్రేషన్స్ పీక్స్
-
Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
-
Vaibhav Sooryavanshi: “రెండు సెంచరీలు మిస్.. ఫీల్ అవుతున్నావా?”.. క్వాలిఫయర్ 2కు ముందు వైభవ్ ఆసక్తికర సమాధానం..
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!