IND vs AUS: విరాట్ కోహ్లీకి గాయం..! అభిమానుల్లో టెన్షన్
- ఈనెల 6 నుంచి అడిలైడ్లో పింక్ బాల్ టెస్ట్
- తొలి టెస్టులో గెలిచిన టీమిండియా
- రెండో టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియాకు షాక్
- స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మోకాలికి గాయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 6 నుంచి అడిలైడ్లో పింక్ బాల్ టెస్ట్ మొదలు కానుంది. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. ఈ టెస్టులోనూ విక్టరీ సాధించాలని చూస్తోంది. అయితే.. ఈ టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మోకాలికి గాయమైంది. అతను వైద్య సహాయం కోరుతూ వీడియోలో కనిపించాడు. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందతున్నారు. ప్రాక్టీస్ సెషన్కు సంబంధంచి ఒక వీడియో బయటికొచ్చింది. అందులో.. జట్టు వైద్య సిబ్బంది కోహ్లీ కుడి మోకాలికి బ్యాండేజ్ చేయడం కనిపించింది.
Read Also: Vitamin ‘D’ Deficiency: ‘విటమిన్ డి’ లోపం ఉంటే ఇవి తినండి.. మళ్లీ సమస్య రాదు..
Also Read
- TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
- Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై దూసుకెళ్లిన బొలెరో.!
- WhatsApp New Feature: వాట్సాప్లో సరికొత్త ఫీచర్.. ఇక, ఎవరి బర్త్డేలు మిస్ కారు..!
ఈ వీడియోలో కోహ్లీ మోకాలికి కట్టు కట్టుకుని ఉన్నాడు. కాగా.. మెళ్లిమెళ్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్లినట్లు కనిపించింది. అయితే, కోహ్లీ నడిచిన తీరు చూస్తే పెద్ద గాయమైనట్లు ఏమీ ఉండదని తెలుస్తోంది. కోహ్లీ గాయం ఎంత తీవ్రంగా ఉందో ప్రస్తుతానికి ఏమీ తెలియనప్పటికీ, అతను పూర్తిగా ఫిట్గా తిరిగి మైదానంలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కోహ్లీ ఫామ్ భారత్కు చాలా కీలకం కానుంది. పెర్త్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పేలవ ప్రదర్శన కనబరచగా.. రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా.. భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్లో కంగారూ జట్టును 294 పరుగుల తేడాతో ఓడించింది.
Read Also: Nissan Magnite SUV: ఇండియాలో భారీగా అమ్ముడవుతున్న నిస్సాన్ మాగ్నైట్.. లక్షల్లో యూనిట్లు సేల్
పెర్త్ టెస్ట్లో సెంచరీ చేసి కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. మరోవైపు.. రెండో టెస్టులో కోహ్లీ మరో 23 పరుగులు సాధిస్తే.. డే/నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్ను అందుకున్న తొలి భారత ప్లేయర్గా కోహ్లి ఘనత సాధిస్తాడు. 102 పరుగులు సాధిస్తే అడిలైడ్ వేదికలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్గా లారా రికార్డును కోహ్లి అధిగమిస్తాడు.
తాజావార్తలు
-
Indian Navy SSC Officer Recruitment 2026: భారత నావికాదళంలో 275 SSC ఆఫీసర్ పోస్టులు.. అర్హత, ఎంపిక విధానం వివరాలు
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Dhanush : ధనుష్ ‘DxV’ క్రేజీ పోస్టర్.. అసలు ఆ డైరెక్టర్ ఎవరు?
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
-
Mysa: నీటి అడుగున రష్మిక రిస్క్.. ‘మైసా’ నుంచి క్రేజీ అప్డేట్
ట్రెండింగ్
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!