Ram Mandir : అయోధ్య రామాలయంలో వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు బ్రేక్.. కారణం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామాలయంలో రాంలాలాకు పట్టాభిషేకం జరిగిన మొదటి వార్షికోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొదటి వార్షికోత్సవం జనవరి 11న నిర్వహించబడుతుంది. ఇందుకోసం మూడు రోజుల వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ మాట్లాడుతూ తొలి రాంలాలా తొలి వార్షికోత్సవానికి ప్రతిష్ఠా ద్వాదశిగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేడుకలను ప్రారంభించనున్నారు. కాగా, రామమందిరం ట్రస్టు, పరిపాలన అధికారులు వేదికను పరిశీలించారు.
భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ, వీవీఐపీ దర్శనంపై నిషేధం విధించినట్లు శ్రీరామజన్మభూమి క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. జనవరి 11 నుంచి 13 వరకు శ్రీరామ మందిర వీఐపీ దర్శనం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా వీఐపీ, వీవీఐపీ పాస్లు చేయరు. మిగిలిన ఉదయం, సాయంత్రం, రాత్రి స్లాట్లు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
Also Read
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
Read Also:JC Prabhakar Reddy: జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి: సందిరెడ్డి
జనవరి 11 నుంచి 13 వరకు జరిగే కార్యక్రమాల ప్రణాలికలను సిద్ధం చేశామని చంపత్ రాయ్ తెలిపారు. జనవరి 11న రామాలయంలో తొలి వార్షికోత్సవానికి సందర్భంగా నిర్వహించే ప్రతిష్ఠా ద్వాదశి కార్యక్రమాన్ని సీఎం యోగి ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు సంబంధించి జనవరి 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామలల్ల అలంకారం, మహా అభిషేకం, మహా హారతి నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ్ లల్లా మహా హారతి నిర్వహించనున్నారు.
ప్రాణ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవానికి పరిపాలన అధికారులు కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేశారు. గురువారం డివిజనల్ కమీషనర్ గౌరవ్ దయాల్, జిల్లా మెజిస్ట్రేట్, పలువురు అధికారులు వేదికను పరిశీలించారు. డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 11న రాంలీలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనురాధ పౌడ్వాల్, మాలినీ అవస్తి, కుమార్ విశ్వాస్ జనవరి 12 , 13 తేదీలలో తమ కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
Read Also:WhatsApp Location Trace: వాట్సాప్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేయకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే
తాజావార్తలు
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?