Ram Mandir : అయోధ్య రామాలయంలో వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు బ్రేక్.. కారణం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామాలయంలో రాంలాలాకు పట్టాభిషేకం జరిగిన మొదటి వార్షికోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొదటి వార్షికోత్సవం జనవరి 11న నిర్వహించబడుతుంది. ఇందుకోసం మూడు రోజుల వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ మాట్లాడుతూ తొలి రాంలాలా తొలి వార్షికోత్సవానికి ప్రతిష్ఠా ద్వాదశిగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేడుకలను ప్రారంభించనున్నారు. కాగా, రామమందిరం ట్రస్టు, పరిపాలన అధికారులు వేదికను పరిశీలించారు.
భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ, వీవీఐపీ దర్శనంపై నిషేధం విధించినట్లు శ్రీరామజన్మభూమి క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. జనవరి 11 నుంచి 13 వరకు శ్రీరామ మందిర వీఐపీ దర్శనం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా వీఐపీ, వీవీఐపీ పాస్లు చేయరు. మిగిలిన ఉదయం, సాయంత్రం, రాత్రి స్లాట్లు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
Read Also:JC Prabhakar Reddy: జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి: సందిరెడ్డి
జనవరి 11 నుంచి 13 వరకు జరిగే కార్యక్రమాల ప్రణాలికలను సిద్ధం చేశామని చంపత్ రాయ్ తెలిపారు. జనవరి 11న రామాలయంలో తొలి వార్షికోత్సవానికి సందర్భంగా నిర్వహించే ప్రతిష్ఠా ద్వాదశి కార్యక్రమాన్ని సీఎం యోగి ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు సంబంధించి జనవరి 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామలల్ల అలంకారం, మహా అభిషేకం, మహా హారతి నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ్ లల్లా మహా హారతి నిర్వహించనున్నారు.
ప్రాణ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవానికి పరిపాలన అధికారులు కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేశారు. గురువారం డివిజనల్ కమీషనర్ గౌరవ్ దయాల్, జిల్లా మెజిస్ట్రేట్, పలువురు అధికారులు వేదికను పరిశీలించారు. డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 11న రాంలీలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనురాధ పౌడ్వాల్, మాలినీ అవస్తి, కుమార్ విశ్వాస్ జనవరి 12 , 13 తేదీలలో తమ కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
Read Also:WhatsApp Location Trace: వాట్సాప్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేయకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!