Manipur Violence: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు..!
Manipur Violence: మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు మే 3న ప్రారంభించిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. దీంతో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆ రాష్ట్రంలో సందర్శించి.. రాష్ట్రంలోని అన్ని వర్గాల నేతలతో మాట్లాడినప్పటికీ పరిష్కారం సద్దుమనుగడం లేదు. తాజాగా శుక్రవారం రాత్రి ఆటోమేటిక్ తుపాకులను ధరించి.. బిష్ణుపూర్ జిల్లాలోని క్వక్ట, చురాచాంద్పూర్లోని కంగ్వాయ్ ప్రాంతాల్లో కాల్పులు జరిపారు. శనివారం తెల్లవారుజాము వరకు కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి.
Read Also: Bullet Bike: దారుణం.. బుల్లెట్ బైక్ కట్నంగా ఇవ్వలేదని విషమిచ్చి చంపేశారు..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఈ నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులపై దాడులు చేసి వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. సుదీర్ఘమైన జాతి హింస ఫలితంగా క్యాబినెట్ మంత్రులతో సహా పలువురు ప్రజా ప్రతినిధులు దాడికి గురయ్యారు. ఈ హింస ఘటనలో బిజెపి నాయకుల నివాసాలను ధ్వంసం చేసి.. దాడికి ప్రయత్నించారు. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి ఆర్.కె రంజన్ సింగ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఇటీవల ఆకతాయిలు బీజేపీ నేతల ఇళ్లను తగులబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే వారిని ఆర్మీ సిబ్బంది చెదరగొట్టడంతో ఎటువంటి హాని జరగలేదు.
Read Also: Adipurush: ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు… రికార్డులు ఏమైనా మిగిలాయా?
ఇంఫాల్లోని కేంద్ర విదేశీ వ్యవహారాలు మరియు విద్యా శాఖ సహాయ మంత్రి ఆర్కె రంజన్ సింగ్ నివాసానికి గురువారం (జూన్ 15) రాత్రి కొందరు నిప్పు పెట్టారు. అంతకుముందు మే 23న కూడా రంజన్ సింగ్ నివాసంలోకి కొందరు ప్రవేశించారు. అయితే భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టారు. అంతేకాకుండా సింగ్ ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. అంతేకాకుండా మణిపూర్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి నెమ్చా కిప్జెన్ అతని నివాసానికి నిప్పు పెట్టారు. అయితే ఆమె లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమె అధికారిక నివాసాన్ని తగలబెట్టారు.
మణిపూర్ మంత్రివర్గంలో కిప్జెన్ మహిళా ప్రజా ప్రతినిధిగా కొనసాగుతున్నారు. హింసాకాండ మధ్య కుకీ-జోమి-చిన్-హ్మార్ కమ్యూనిటీల కోసం 10 మంది కుకీ చట్టసభ సభ్యులలో ఆమె ప్రత్యేక పరిపాలనను కోరారు. మరో మంత్రి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి గోవిందాస్ కొంతౌజం ఇంటిని కూడా మే 24న ధ్వంసం చేశారు. ఇంఫాల్లోని రాష్ట్ర మంత్రి టి. బిశ్వజిత్ సింగ్ నివాసంపై మరో కొందరు దాడికి ప్రయత్నించారు. థాన్లోన్ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యేపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఆ తర్వాత వాల్టే తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో