Site icon NTV Telugu

Vijay-Rashm : పెళ్లి చేసుకున్న ఆనందంలో ‘విరోష్’ అదిరిపోయే నిర్ణయం..

Vijay Rashmika

Vijay Rashmika

టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వైవాహిక బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వార్త సోషల్ మీడియాలో ఒక సంచలనం సృష్టించింది. కేవలం అభిమానులే కాకుండా, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి ప్రముఖులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తమపై ఇంతటి ప్రేమను కురిపించిన దేశ ప్రజల కోసం విజయ్, రష్మిక ఒక అద్భుతమైన గిఫ్ట్‌ను ప్రకటించారు.

Also Read : Toxic: టాక్సిక్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైం ఫిక్స్!

తమ పెళ్లి ఆనందాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరితో పంచుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రధాన ప్రాంతాలను ఎంచుకుని, అక్కడ తమ తరపున మిఠాయిలు (Sweets) పంపిణీ చేయడమే కాకుండా, పలు దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలను (భోజనాలు) ఏర్పాటు చేస్తున్నారు.

“మా పెళ్లికి మీరు చూపించిన ప్రేమకు ఇది మా చిన్న కృతజ్ఞత” అంటూ రష్మిక తమ ఇద్దరి తరపున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేడు, మార్చి 1వ తేదీన ఈ గిఫ్ట్‌ల పంపిణీ, భోజన ఏర్పాట్లు జరుగుతాయని ఆమె వెల్లడించారు. ఒక స్టార్ జంట తమ పెళ్లి సందర్భంగా ఇలా సామాన్య ప్రజల ఆకలి తీర్చే కార్యక్రమం చేపట్టడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది నిజంగా ‘రౌడీ’ స్టైల్ థాంక్స్ గివింగ్ అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Exit mobile version