Bapatla: మార్టురులో గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్ దాడులు.. అడ్డుకున్న ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాపట్ల జిల్లా మార్టూరులో పలు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్, మైనింగ్, లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో.. సమాచారం తెలుసుకుని పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గ్రానైట్ ఫ్యాక్టరీల వద్దకు చేరుకుని అధికారులను నిలదీశారు. సెర్చింగ్ ఆర్డర్స్ లేకుండా, డిప్యూటేషన్ లేకుండా నెల్లూరు మైనింగ్ ఏడీ మార్టూరులో ఎలా తనిఖీలు చేస్తారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. మైనింగ్ డైరెక్టర్ చెబితే వెంటనే దాడులు చేస్తారా అంటూ ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు.
IND vs ENG: విశాఖలో క్రికెట్ సందడి.. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు భారీగా..!
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
టీడీపీ సానుభూతిపరులకు చెందిన గ్రానైట్ ప్యాక్టరీలపై బలవంతంగా దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే సాంబశివరావు ఆరోపించారు. పోలీసులను, విజిలెన్స్ అధికారులను అడ్డుపెట్టుకుని ప్యాక్టరీల యజమానులతో తప్పులు చేయించి.. తిరిగి ఫ్యాక్టరీల పైనే తనిఖీలు చేసి ఫెనాల్టీలు విధించడమేంటంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలపై దాడులు నిర్వహించిన మైనింగ్ అధికారుల వెంట వచ్చిన వాహనాల్లో కారం పొట్లాలను గుర్తించారు. అవి వాహనాల్లో ఎందుకు తీసుకొచ్చారంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలలో అధికారుల వెంట ప్రైవేట్ వ్యక్తులు వచ్చారని టీడీపీ వర్గీయులు ఆరోపించారు.
MPs Suspension: బడ్జెట్కు ముందు కేంద్రం కీలక నిర్ణయం.. విపక్ష ఎంపీల సస్పెన్షన్ రద్దు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ.. ఒక ఏడీ స్థాయి అధికారి నలుగురు రౌడీలను పట్టుకుని నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చారన్నారు. వీళ్లు వ్యాపారస్తులను బెదిరించడం, భయపెట్టడం వారి దగ్గరి నుంచి లంచాలు తీసుకోవడం వీరి పని అన్నారు. రాష్ట్రంలో ఒక అరాచకమైన పాలన రాజ్యమేలుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. కాగా.. దాడులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!