NTV Telugu Site icon

Video viral: యూపీలో దారుణం.. నడిరోడ్డుపై భార్యపై దాడి.. సినిమా చూసినట్టు చూసిన జనాలు

Video 2

Video 2

గత ఆదివారం యూపీలో బ్యూటీ పార్లర్‌లో వధువును మాజీ ప్రియుడు తుపాకీతో కాల్చి చంపిన ఘటనను మరువక ముందే.. అదే ప్రాంతంలో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత రద్దీగా ఉండే ఝాన్సీలో నడిరోడ్డుపై భార్యపై దాడికి తెగబడ్డాడు భర్త. ఇష్టానుసారంగా ఆమెపై దాడి చేస్తున్నా.. చుట్టూ జనాలు ఉన్నా ప్రేక్షకుల్లా చూశారే తప్ప ఎవరూ రక్షించే ప్రయత్నం చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

జూన్ 25 (మంగళవారం) ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రోడ్డంతా జనంతో రద్దీగా ఉంది. పట్టపగలే ఒక వ్యక్తి.. నడిరోడ్డుపై భార్యపై దాడి చేస్తు్న్నాడు. దారుణాతి దారుణంగా దాడి చేశాడు. కానీ ఎవరూ ఆపే ప్రయత్నమే చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాధితురాల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు శివం యాదవ్‌గా గుర్తించారు. వీడియోలో అతడు భార్య జుట్టును లాగడం, మోచేతితో కొట్టడం దృశ్యాలు కనిపించాయి. తీవ్రంగా దాడి చేసి నేలకు ఒరిగేలా చేశాడు. దెబ్బలు తాళలేక కిందపడిపోయింది. సమీపంలో ఆడవాళ్లు, మగవాళ్లు ఉన్నా.. సినిమా చూసినట్టు చూస్తున్నారే తప్ప.. ఒక్కరు కూడా జోక్యం చేసుకుని ఆపే ప్రయత్నం చేయలేదు. ఇక బాధితురాలు మోహిని.. భర్తపై నవాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్యాభర్తల గొడవ సంబంధించిన కేసు అని బాధితురాలు పేర్కొంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇదే ఝాన్సీ ప్రాంతంలో వధువును తుపాకీతో కాల్చి మాజీ ప్రియుడు హతమార్చడంతో తీవ్ర కలకలం రేపింది. పెళ్లి పీటలు ఎక్కేముందు బ్యూటీ పార్లర్‌కు ప్రాణాలు కోల్పోయింది. తాజా ఘటనలతో ఝాన్సీలో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.