Ranji Trophy 2024: మధ్యప్రదేశ్పై ఉత్కంఠ విజయం.. ఫైనల్కు దూసుకెళ్లిన విదర్భ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidarbha set final with Mumbai in Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో విదర్భ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. చివరి రోజు వరకుఉత్కంఠగా సాగిన సెమీస్లో మధ్యప్రదేశ్ను ఓడించిన విదర్భ.. మూడోసారి రంజీ ట్రోఫీ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఇక ఫైనల్లో ముంబైతో విదర్భ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్ మ్యాచ్లో తమిళనాడుపై ముంబై గెలిచిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో ముంబై 48వ సారి రంజీ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది. మార్చి 10న ముంబై, విదర్భ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది.
శనివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విదర్భ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకు ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ (63) హాఫ్ సెంచరీతో రాణించాడు. మధ్యప్రదేశ్ బౌలర్ అవేశ్ ఖాన్ 4 వికెట్స్ పడగొట్టాడు. ఆపై తొలి ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్ 252 పరుగులు చేసింది. వికెట్ కీపర్ హిమాన్షు మంత్రి సెంచరీ (126) బాదాడు. 82 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంబించిన విదర్భ.. 402 పరుగులు చేసింది. యశ్ రాథోడ్ సెంచరీ (141) చేయగా.. అక్షయ్ వాడ్కర్ అర్ధ శతకం (77) బాదాడు. దాంతో మధ్యప్రదేశ్కు 321 పరుగుల లక్ష్యంను విదర్భ విధించింది.
Also Read
- Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
- Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. చివరి రోజు మధ్యప్రదేశ్ విజయానికి 93 పరుగులు అవసరం కాగా.. విదర్భ గెలుపుకు నాలుగు వికెట్లు అవ్సరం అయ్యాయి. ఓవర్నైట్ స్కోరు 228/6 తో బుధవారం ఐదో రోజు ఆటను మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ ఆరంభంలోనే వికెట్స్ కోల్పోయింది. కుమార్ కార్తికేయ (4), అనుభవ్ అగర్వాల్(6) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఆవేశ్ ఖాన్తో కలిసి సారాంశ్ జైన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే సారాంశ్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. అనంతరం ఖెజ్రోలియా (11) కూడా బౌల్డ్ అవడంతో మధ్యప్రదేశ్ ఓడిపోయింది.
తాజావార్తలు
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
-
Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!