Sanatana Dharma: సనాతన ధర్మంపై దుర్భాషలా..? ఉదయనిధిని బర్తరఫ్ చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanatana Dharma: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి.. బీజేపీ నేతలు, హిందూ సంఘాలు, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల నేతలు విరుచుకుపడుతున్నారు.. ఇప్పటికే ఈ వ్యవహారంపై పలు సందర్భాల్లో స్పందించిన విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సెక్రెటరీ మిలింద్ పరాండే.. మరోసారి ఉదయనిధిపై మండిపడ్డారు.. సనాతన ధర్మంపై దుర్భాష లాడిన మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు క్రీడామంత్రి ఉదయనిధి స్టాలిన్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. హిందువులను అవమానించిన ఉదయనిధి స్టాలిన్ ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ వినిపించారు.
Read Also: Health Tips: రోజూ పిస్తా పప్పులను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
మరోవైపు.. రాహుల్ గాంధీ మాత్రమే తన పాదయాత్రకి భారత్ జోడో యాత్ర అని పెట్టుకోవచ్చు.. కానీ, ఇండియాకి భారత్ పేరు పెట్టకూడదా..? అని ప్రశ్నించారు మిలింద్ పరాండే.. ఆంధ్రప్రదేశ్లో కూడా మతమార్పిడుల నిషిద్ధం విధించాలని సూచించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వాఖ్యలు చేశారు.. ఇక, సుప్రీం కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి అని దేశంలో 140 మంది ప్రముఖ మేధావులు అందరూ తీర్మానం చేశారన్నారు. మల్లికార్జున ఖర్గే, చిదంబరం కొడుకులు ఉదయనిధి స్టాలిన్ వాఖ్యలను సమర్ధించడం బాధాకరం అని.. తమిళ ప్రజలు కూడా ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు వీహెచ్పీ అంతర్జాతీయ సెక్రెటరీ మిలింద్ పరాండే. కాగా, తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్పై తప్పుడు ప్రచారం సాగుతోందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. బీజేపీ వక్రీకరించినట్లు సనాతన ధర్మం నిర్మూలనకు ఉదయనిధి పిలుపునివ్వలేదు.. కానీ, వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారు.. బాధ్యతగల ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు మరియు బీజేపీ నేతలు వాస్తవాలను విస్మరించడం సరైందికాదన్నారు.. వాస్తవాలను ధృవీకరించుకోవడానికి అన్ని వనరులు ఉన్నప్పట్టికీ.. నకిలీ కథనాలను నడపడం చూసి నిరుత్సాహంగా ఉందని పేర్కొన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!