Sanatana Dharma: సనాతన ధర్మంపై దుర్భాషలా..? ఉదయనిధిని బర్తరఫ్ చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanatana Dharma: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి.. బీజేపీ నేతలు, హిందూ సంఘాలు, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల నేతలు విరుచుకుపడుతున్నారు.. ఇప్పటికే ఈ వ్యవహారంపై పలు సందర్భాల్లో స్పందించిన విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సెక్రెటరీ మిలింద్ పరాండే.. మరోసారి ఉదయనిధిపై మండిపడ్డారు.. సనాతన ధర్మంపై దుర్భాష లాడిన మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు క్రీడామంత్రి ఉదయనిధి స్టాలిన్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. హిందువులను అవమానించిన ఉదయనిధి స్టాలిన్ ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ వినిపించారు.
Read Also: Health Tips: రోజూ పిస్తా పప్పులను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
మరోవైపు.. రాహుల్ గాంధీ మాత్రమే తన పాదయాత్రకి భారత్ జోడో యాత్ర అని పెట్టుకోవచ్చు.. కానీ, ఇండియాకి భారత్ పేరు పెట్టకూడదా..? అని ప్రశ్నించారు మిలింద్ పరాండే.. ఆంధ్రప్రదేశ్లో కూడా మతమార్పిడుల నిషిద్ధం విధించాలని సూచించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వాఖ్యలు చేశారు.. ఇక, సుప్రీం కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి అని దేశంలో 140 మంది ప్రముఖ మేధావులు అందరూ తీర్మానం చేశారన్నారు. మల్లికార్జున ఖర్గే, చిదంబరం కొడుకులు ఉదయనిధి స్టాలిన్ వాఖ్యలను సమర్ధించడం బాధాకరం అని.. తమిళ ప్రజలు కూడా ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు వీహెచ్పీ అంతర్జాతీయ సెక్రెటరీ మిలింద్ పరాండే. కాగా, తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్పై తప్పుడు ప్రచారం సాగుతోందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. బీజేపీ వక్రీకరించినట్లు సనాతన ధర్మం నిర్మూలనకు ఉదయనిధి పిలుపునివ్వలేదు.. కానీ, వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారు.. బాధ్యతగల ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు మరియు బీజేపీ నేతలు వాస్తవాలను విస్మరించడం సరైందికాదన్నారు.. వాస్తవాలను ధృవీకరించుకోవడానికి అన్ని వనరులు ఉన్నప్పట్టికీ.. నకిలీ కథనాలను నడపడం చూసి నిరుత్సాహంగా ఉందని పేర్కొన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!