NTV Telugu Site icon

Venkatesh : చిరంజీవి లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాడిని..

Whatsapp Image 2023 12 28 At 1.16.34 Pm

Whatsapp Image 2023 12 28 At 1.16.34 Pm

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా సైంధవ్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జేఈర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వెంకీ 75 కలియుగ పాండవులు టు సైంధవ్ పేరుతో మేకర్స్ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు.ఈ వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్టుగా విచ్చేసారు. అలాగే నాని, ఆండ్రియా, రుహానీ శర్మ మరియు డైరెక్టర్ శైలేష్ కొలనుతోపాటు పలువురు తారలు ఈ ఈవెంట్ లో సందడి చేశారు.వెంకీ 75 కార్యక్రమంలో తన మొదటి సినిమా కలియుగ పాండవులు గురించి చెబుతూ వెంకటేష్ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. “గురువు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన కలియుగ పాండవులు చిత్రంతో నా సినీ ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావు మరియు కె విశ్వనాథ్ పలువురు అగ్ర దర్శకులతో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవం. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను” అని వెంకటేష్ తెలిపారు.”జయాపజయాల్ని చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాలను గమనించి నన్ను ప్రోత్సహించారు.

మొదట్లో విక్టరీ అనేవారు. తర్వాత రాజా అని పిలిచేవారు. కొన్నాళ్లు పెళ్లికాని ప్రసాద్ అని అనేవారు.. తర్వాత పెద్దోడు మరియు వెంకీ మామ అన్నారు. ఇలా పిలుపు మారినా కానీ ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగా పని చేస్తున్నాను” అని వెంకటేష్ అన్నారు.చాలాసార్లు సినీ కెరీర్‌ను వదిలి పెట్టి హిమాలయాలకు వెళ్లిపోదాం అనుకునేవాణ్ని. అంతలోనే చిరంజీవి వచ్చి ఓ బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చేవారు. నాతోటి హీరోలైనా బాలకృష్ణ మరియు నాగార్జున వీళ్లంతా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారు. అందుకే హిమాలయాలకు వెళ్లకుండా సినిమాలను కొనసాగించాను అని వెంకటేష్ తెలిపారు.నా 75వ చిత్రం సైంధవ్ ఎంతో గొప్ప మూవీ అవుతుంది. జనవరి 13న అందరినీ ఎంతగానో అలరిస్తుంది.కృషి, పట్టుదల, నిలకడతోనే విజయాలు సాధ్యం అవుతాయి. ఎక్కువ హైరానా పడకుండా సహజంగా ఉండేందుకు అందరూ ప్రయత్నించాలి. ఏదైనా రావాల్సిన సమయంలోనే వస్తుంది. చిరంజీవితో కలిసి త్వరలోనే నేను మూవీ చేస్తా” అని వెంకటేష్ తెలిపారు..