Venkatesh : చిరంజీవి లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాడిని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా సైంధవ్. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్లో జేఈర్సీ కన్వెన్షన్ సెంటర్లో వెంకీ 75 కలియుగ పాండవులు టు సైంధవ్ పేరుతో మేకర్స్ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు.ఈ వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్టుగా విచ్చేసారు. అలాగే నాని, ఆండ్రియా, రుహానీ శర్మ మరియు డైరెక్టర్ శైలేష్ కొలనుతోపాటు పలువురు తారలు ఈ ఈవెంట్ లో సందడి చేశారు.వెంకీ 75 కార్యక్రమంలో తన మొదటి సినిమా కలియుగ పాండవులు గురించి చెబుతూ వెంకటేష్ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. “గురువు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన కలియుగ పాండవులు చిత్రంతో నా సినీ ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావు మరియు కె విశ్వనాథ్ పలువురు అగ్ర దర్శకులతో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవం. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను” అని వెంకటేష్ తెలిపారు.”జయాపజయాల్ని చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాలను గమనించి నన్ను ప్రోత్సహించారు.
మొదట్లో విక్టరీ అనేవారు. తర్వాత రాజా అని పిలిచేవారు. కొన్నాళ్లు పెళ్లికాని ప్రసాద్ అని అనేవారు.. తర్వాత పెద్దోడు మరియు వెంకీ మామ అన్నారు. ఇలా పిలుపు మారినా కానీ ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగా పని చేస్తున్నాను” అని వెంకటేష్ అన్నారు.చాలాసార్లు సినీ కెరీర్ను వదిలి పెట్టి హిమాలయాలకు వెళ్లిపోదాం అనుకునేవాణ్ని. అంతలోనే చిరంజీవి వచ్చి ఓ బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చేవారు. నాతోటి హీరోలైనా బాలకృష్ణ మరియు నాగార్జున వీళ్లంతా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారు. అందుకే హిమాలయాలకు వెళ్లకుండా సినిమాలను కొనసాగించాను అని వెంకటేష్ తెలిపారు.నా 75వ చిత్రం సైంధవ్ ఎంతో గొప్ప మూవీ అవుతుంది. జనవరి 13న అందరినీ ఎంతగానో అలరిస్తుంది.కృషి, పట్టుదల, నిలకడతోనే విజయాలు సాధ్యం అవుతాయి. ఎక్కువ హైరానా పడకుండా సహజంగా ఉండేందుకు అందరూ ప్రయత్నించాలి. ఏదైనా రావాల్సిన సమయంలోనే వస్తుంది. చిరంజీవితో కలిసి త్వరలోనే నేను మూవీ చేస్తా” అని వెంకటేష్ తెలిపారు..
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
తాజావార్తలు
-
Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో
-
Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!
-
Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
-
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!