Venkatesh : చిరంజీవి లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాడిని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా సైంధవ్. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్లో జేఈర్సీ కన్వెన్షన్ సెంటర్లో వెంకీ 75 కలియుగ పాండవులు టు సైంధవ్ పేరుతో మేకర్స్ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు.ఈ వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్టుగా విచ్చేసారు. అలాగే నాని, ఆండ్రియా, రుహానీ శర్మ మరియు డైరెక్టర్ శైలేష్ కొలనుతోపాటు పలువురు తారలు ఈ ఈవెంట్ లో సందడి చేశారు.వెంకీ 75 కార్యక్రమంలో తన మొదటి సినిమా కలియుగ పాండవులు గురించి చెబుతూ వెంకటేష్ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. “గురువు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన కలియుగ పాండవులు చిత్రంతో నా సినీ ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావు మరియు కె విశ్వనాథ్ పలువురు అగ్ర దర్శకులతో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవం. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను” అని వెంకటేష్ తెలిపారు.”జయాపజయాల్ని చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాలను గమనించి నన్ను ప్రోత్సహించారు.
మొదట్లో విక్టరీ అనేవారు. తర్వాత రాజా అని పిలిచేవారు. కొన్నాళ్లు పెళ్లికాని ప్రసాద్ అని అనేవారు.. తర్వాత పెద్దోడు మరియు వెంకీ మామ అన్నారు. ఇలా పిలుపు మారినా కానీ ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగా పని చేస్తున్నాను” అని వెంకటేష్ అన్నారు.చాలాసార్లు సినీ కెరీర్ను వదిలి పెట్టి హిమాలయాలకు వెళ్లిపోదాం అనుకునేవాణ్ని. అంతలోనే చిరంజీవి వచ్చి ఓ బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చేవారు. నాతోటి హీరోలైనా బాలకృష్ణ మరియు నాగార్జున వీళ్లంతా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారు. అందుకే హిమాలయాలకు వెళ్లకుండా సినిమాలను కొనసాగించాను అని వెంకటేష్ తెలిపారు.నా 75వ చిత్రం సైంధవ్ ఎంతో గొప్ప మూవీ అవుతుంది. జనవరి 13న అందరినీ ఎంతగానో అలరిస్తుంది.కృషి, పట్టుదల, నిలకడతోనే విజయాలు సాధ్యం అవుతాయి. ఎక్కువ హైరానా పడకుండా సహజంగా ఉండేందుకు అందరూ ప్రయత్నించాలి. ఏదైనా రావాల్సిన సమయంలోనే వస్తుంది. చిరంజీవితో కలిసి త్వరలోనే నేను మూవీ చేస్తా” అని వెంకటేష్ తెలిపారు..
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!