Venkaiah Naidu: యోగాను మతంతో ముడిపెట్టడం మూర్ఖత్వం..

Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu: యోగా ఒక మతానికి పరిమితం కాదు.. అలా చూస్తే అది మూర్ఖత్వం అవుతోందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సికింద్రాబాద్ ఫరెడ్ గ్రౌండ్స్‌లో యోగా డే కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. యోగా చేస్తే సమగ్ర మనిషిగా మారుతారని.. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా అన్నారు. యోగా సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వతోముఖాభివృద్ధికి యోగా అవసరమని పేర్కొన్నారు. మానవ చైతన్యానికి నిదర్శనం యోగా అని.. పూర్వీకులు రంగరించి మనకు అందించిన జీవన విధానమన్నారు. ఆరోగ్య, ఆధ్యాత్మిక, మానసిక ఒత్తిడి, స్థైర్యాన్ని ఇచ్చేది యోగా అని చెప్పారు. యోగా అనేది మనిషికి, ప్రకృతిమాత అందించే గొప్ప వరమని.. ప్రకృతి ఒడిలో ప్రజలు జీవించాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము మాటను నిజం చేయాలన్నారు.

అనంతరం ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ ప్రసంగించారు. “ప్రపంచానికి యోగాను అందించింది భారతదేశం. ప్రాచీన సంస్కృతిలో భాగమే యోగా. గత ఆధ్యాత్మిక, ఆరోగ్య చింతన ప్రతి ఒక్కరికీ అవసరం.” అన్నారు. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్రమోడీ 12 సంవత్సరాల క్రితం యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని గుర్తు చేశారు. ప్రపంచ దేశాల్లో యోగాను చేస్తున్నారని.. వ్యక్తి నిర్మాణంలో యోగా పని చేస్తోందన్నారు. యోగా వల్ల ఆరోగ్య, స్వాస్త్ భారత్ సాధ్యం అవుతుందని చెప్పారు. యోగా వలన డిప్రెషన్ తొలగిపోతుందని.. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ యోగా చేయాలని సూచించారు.

×
×
Ad