Venkaiah Naidu: గాంధీ కోరిక మేరకు ప్రధాని పదవిని వదులుకున్న త్యాగశీలి పటేల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: పటేల్ 150 జయంతి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సర్దార్ ఒక ఉక్కుమనిషి.. పటేల్ దేశ సమైక్యత శిల్పి అని కొనియాడారు. ఆయన సంస్కరణలు దేశానికి ఆదర్శం.. దేశానికి మొదటి ప్రధాని కావాల్సిన వారని గుర్తు చేశారు. దేశంలో ఉన్న 15 రాష్ట్రాల్లో నాడు 14 రాష్ట్రాలు పటేల్ ప్రధాని కావాలని కోరాయని తెలిపారు. గాంధీ కోరిక మేరకు ప్రధాని పదవిని వదులుకున్న త్యాగశీలి పటేల్ అని చెప్పారు. 565 సంస్థానాల రాజులతో మాట్లాడి దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత పటేల్దన్నారు. నాడు బ్రిటిష్ కుతంత్రాలలో కూరుకుపోయిన వ్యక్తి నిజాం అని తెలిపారు. హైదరాబాద్ ను స్వతంత్ర రాజ్యాంగ ప్రకటిస్తానని నిజాం ప్రకటించారన్నారు.
READ MORE: Kishan Reddy: నెహ్రూ తప్ప కాంగ్రెస్ కు ఎవ్వరు అవసరం లేదు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
నాడు లొంగిపోవాలని నిజాంకు పటేల్ 48 గంటల సమయం ఇచ్చారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. “ఆపరేషన్ పోలోతో నిజాం నడ్డి విరిచి, హైదరాబాద్ ను భారత్ లో కలిపిన ఘనత పటేల్ది.. దేశం ఐక్యతతో ముందుకు సాగాలి.. దేశ ఐక్యతే పటేల్ కు మనమిచ్చే అతి పెద్ద గౌరవం.. దేశ యువత పటేల్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.. మొంథా తుఫాన్ లో మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తున్నాను.. నష్టపోయిన బాధితులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలవాలి..” అని వెంకయ్యా నాయుడు కోరారు.
READ MORE: DGP Shivadhar Reddy: మహిళలు, పిల్లలకు రక్షణగా భరోసా సెంటర్లు
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..