Vehicle Scrapping Policy : ఈ పని చేస్తే చాలు.. జంక్ వాహనంపై మీకు డబుల్ టాక్స్ మినహాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vehicle Scrapping Policy : అధిక కాలుష్య కారకాల వాహనాలను వదిలించుకోవడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. BS-2 , అంతకు ముందు వాహనాలను దశల వారీగా తొలగింపు పనులు మొదలు పెట్టింది. వాటిని తొలగించిన తర్వాత కొత్త వాహనాల కొనుగోలుపై ఒకేసారి పన్ను రాయితీని 50 శాతానికి రెట్టింపు చేయాలని రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం పాత ప్రైవేట్ వాహనాలను రద్దు చేసిన తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేస్తే మోటారు వాహన పన్నుపై 25 శాతం తగ్గింపు ఇవ్వనుంది. అయితే వాణిజ్య వాహనాల విషయంలో ఈ తగ్గింపు 15 శాతానికి పరిమితం చేసింది.
వెహికల్ స్క్రాప్ పాలసీ అంటే ఏమిటి?
పాత, పనికిరాని వాహనాలను స్క్రాప్ చేసే సౌకర్యాన్ని ప్రభుత్వం సాధారణ ప్రజలకు అందిస్తుంది. ప్రైవేట్, వాణిజ్య వాహన యజమానులు ఇద్దరూ ఈ ప్రభుత్వ విధానాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. స్క్రాప్ పాలసీ ప్రకారం, పాత కారు, బైక్, స్కూటర్ మొదలైన వాటిని స్క్రాప్ కోసం ఇవ్వవచ్చు. ఒక ఉదాహరణ ద్వారా వివరించాలంటే.. మీ కారు 10 సంవత్సరాలు (డీజిల్) లేదా 15 సంవత్సరాలు (పెట్రోల్) పూర్తి చేసి ఉంటే ఈ పాలసీ కింద కొత్త కారు కొనేటప్పుడు పాత కారును స్క్రాప్లో ఇవ్వడం ద్వారా మీరు భారీ మొత్తాన్ని ఆదా చేయవచ్చు.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
Read Also:Indiramma Illu Scheme: ఇందిరమ్మ ఇల్లు రాలేదని రైతు ఆత్మహత్య!
ఇప్పుడు 50శాతం పన్ను మినహాయింపు
జనవరి 24న జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్లో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ BS-1 నిబంధనలకు అనుగుణంగా ఉన్న లేదా అంతకు ముందు తయారు చేయబడిన అన్ని వాహనాలకు (వాణిజ్య, వ్యక్తిగత) 50 శాతం వరకు తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. BS-1 నిబంధనల అమలుకు సంబంధించిన అన్ని అంశాలను తయారు చేశారు. ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం, ఈ మినహాయింపు మీడియం, హెవీ ప్రైవేట్, రవాణా వాహనాల పరిధిలోకి వచ్చే BS-2 వాహనాలకు వర్తిస్తుంది. వాహనాలకు BS-1 కార్బన్ ఉద్గార ప్రమాణాలు 2000 సంవత్సరంలో తప్పనిసరి అయ్యాయి. అయితే BS-2 2002 ఏడాది నుండి అమల్లోకి వచ్చింది.
దేశంలో 75 ఏటీఎస్ కేంద్రాలు
రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపేజ్ ఫెసిలిటీస్ (RVSFలు), ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ATS) నెట్వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా 15ఏళ్లు దాటిన వాహనాలను దశలవారీగా తొలగించడానికి.. ఒక పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి రవాణా మంత్రిత్వ శాఖ స్వచ్ఛంద వాహన ఆధునీకరణ కార్యక్రమం లేదా వాహన్ స్క్రాపేజ్ పాలసీని ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 60 కి పైగా RVSFలు, 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 75 కి పైగా ATSలు పనిచేస్తున్నాయి. ఇంకా చాలా పనులు ప్రారంభం అవుతున్నాయి.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!