Vande Mataram: కేంద్ర ప్రభుత్వం వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే నిర్ణయంపై కొన్ని ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం పక్షపాతంగా ఉందని, బలవంతంగా తీసుకొచ్చిన నిర్ణయమని ముస్లిం నేతలు విమర్శించారు. జమీయత్ ఉలెమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదనీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వందేమాతరంను తప్పనిసరి చేయడం రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛపై దాడి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది అల్పసంఖ్యాకుల హక్కులను హరించే ప్రయత్నమని కూడా వ్యాఖ్యానించారు.
Pakistan-US: పాక్ కలవరం.. అమెరికా విడుదల చేసిన ఇండియా మ్యాప్ తొలగింపు
అలాగే జమీయత్ తర్వాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు మౌలానా కౌసర్ హయాత్ ఖాన్ మాట్లాడుతూ.. వందేమాతరం విషయంలో ముస్లింలపై హిందూ సంస్కృతిని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. వందేమాతరంకు వ్యతిరేకత కొత్త విషయం కాదని, స్వాతంత్రానికి ముందు నుంచే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్న అంశాల కారణంగా ముస్లింలు దీనిని అంగీకరించలేరని అన్నారు.
Janasena: తెలంగాణలో ఖాతా తెరిచిన జనసేన.. ఏ జిల్లాలో గెలిచిందంటే..?
ముస్లింలందరినీ హిందువులుగా మార్చాలనుకుంటున్నారా? ఇలాంటి నిర్ణయాలను బలవంతంగా అమలు చేయడం దేశానికి మంచిది కాదని కూడా ఆయన హెచ్చరించారు. ఎవరు దేశాన్ని ఎలా భావిస్తారో అది వారి వ్యక్తిగత విషయం అని, ఆ భావనలను ఇతరులపై రుద్దకూడదని ఆయన అన్నారు.
