Vande Bharat : త్వరలో పెరగనున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ భోగీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat : వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏప్రిల్ 8న ఏపీ, తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న.. సికింద్రబాద్-తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభమైంది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్- తిరుపతి (20701) మధ్య మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే ప్రయాణ సమయం ఉండటంతో రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం రెండున్నర గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతిలో మధ్యాహ్నం 03:15కి బయలుదేరి.. రాత్రి 11:45కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
Read Also: Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ఇటీవల ప్రయాణికుల రద్దీ పెరగడంతో రిజర్వేషన్ దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలులో ప్రస్తుతం 7 ఏసీ బోగీతో పాటు ఒక ఎగ్జిక్యూటివ్ ఏసీ కారు బోగీ ఉంది. కేంద్ర సహాయ మంత్రి కిషన్రెడ్డి సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుతో సమానంగా .. సికింద్రాబాద్- తిరుపతి రైలుకు బోగీల సంఖ్య పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో పెంచే ఆలోచనలో ఉంది. త్వరలోనే 16 బోగీలతో నడిపేందుకు ద.మ.రైల్వే ప్రణాళిక రూపొందిస్తోంది. తిరుపతి- సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే నారాయణాద్రి, వెంకటాద్రి, శబరి, రాయలసీమ తదితర రైళ్లతో సామానంగా టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. వందేభారత్ అందుబాటులోకి రావడంతో సాధారణ రైళ్ల కంటే వందేభారత్కు ఆదరణ మరింత పెరిగింది. సికింద్రాబాద్, తిరుపతి మధ్య నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే వందేభారత్ ట్రైన్ ఆగుతుంది. గుంటూరులో 5 నిమిషాలు, మిగతా స్టేషన్లలో ఒక నిమిషం పాటు మాత్రమే నిలుపుతారు. మొత్తం 660.77 కి.మీ. దూరాన్ని ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటుంది.
Read Also: Tamilnadu: యువకుడిపై లైంగికదాడి.. వీడియో తీసి బెదిరించి..
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..