మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరో కమర్షియల్ హిట్టు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాడు.ఆదికేశవ మూవీతో వైష్ణవ్ కి ఈసారి బ్లాక్ బస్టర్ ఖాయమని అభిమానులు భావించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ మూవీ టీజర్స్ మరియు ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ మూవీ కథలో మార్పులు చేర్పులు చేయడంతో రిలీజ్కు ముందు అభిమానుల్లో అంచనాలు రేకెత్తించింది. కానీ అవుట్డేటెడ్ స్టోరీ లైన్ కారణంగా మొదటి ఆట నుంచే ఈ సినిమా నెగెటివ్ టాక్ను మూటగట్టుకున్నది. ఫస్ట్ వీకెండ్లోనే ఈ మూవీ థియేటర్లలో కనిపించకుండాపోయింది. ఈ మూవీ ఫుల్ థియేట్రికల్ రన్లో కేవలం మూడు కోట్ల వరకు మాత్రమే వసూళ్లను రాబట్టింది. ఎనిమిదిన్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజైన ఈ మూవీ నిర్మాతలకు ఐదున్నర కోట్లకుపైగా నష్టాలను మిగిల్చింది.
థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో ఆదికేశవ మూవీ రిలీజైంది. అక్కడ కూడా ఈమూవీకి థియేటర్ రిజల్ట్ ఎదురైంది. ఓటీటీ ఆడియెన్స్ ఆదికేశవపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే ఇటీవలే ఆదికేశవ మూవీ బుల్లితెరపైకి వచ్చింది. స్టార్మా ఛానెల్లో ఈ మూవీ టెలికాస్ట్ అయ్యింది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి ప్రేక్షకుల నుంచి చక్కటి రెస్పాన్స్ వచ్చింది.ఈ మూవీ ఏకంగా 10.47 టీఆర్పీ రేటింగ్ను దక్కించుకున్నది. ఉప్పెన తర్వాత వైష్ణవ్తేజ్ కెరీర్లో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ దక్కించుకున్న మూవీగా నిలిచింది. ఆదికేశవ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్టర్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆదికేశవ మూవీలో మలయాళ అగ్ర నటుడు జోజు జార్జ్ విలన్గా నటించాడు. ఈ మూవీలో అపర్ణాదాస్ కీలక పాత్ర పోషించింది. సితార ఎంటర్టైన్మెంట్స్తో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ ఈ మూవీని నిర్మించారు.