Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్య వంశీ.. ఈ పేరు ప్రపంచ క్రికెట్లో మారుమోగుతోంది. 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయాలు లిఖిస్తున్నాడు. అంతర్జాతీయ అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భారత్కు ఆరవ టైటిల్ అందించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.. ఈ కుర్రాడు క్రికెట్ను వదిలి కొన్ని రోజులు పుస్తకాలకు అంకితం కానున్నాడు. ఎందుకంటే.. దగ్గర్లో పరీక్షలు ఉన్నాయి. ఇంతకీ వైభవ్ ఎన్నో తరగతో తెలుసా? జస్ట్ పదో తరగతే. ఇప్పుడు తన 10వ తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నాడు వైభవ్. క్రికెట్ మైదానంలో వెలుగులు విరజిమ్మిన అతను, ఇప్పుడు విద్యా మైదానంలో తన ప్రతిభ చూపడానికి రెడీ అయ్యాడు.
READ MORE: Roshan-Emo Emo Idi : ‘ఏమో ఏమో ఇది’ అంటూ మొదలైన రోషన్ కొత్త.. ప్రేమాయణం!
అయితే.. బీహార్లో ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ అంశంపై సమస్తిపూర్లోని పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ నీల కిశోర్ మాట్లాడుతూ.. వైభవ్ సాధారణ విద్యార్థిలాగే పరీక్షలు రాయనున్నాడని చెప్పారు. అతనికి అడ్మిట్ కార్డు వచ్చిందని, స్కూల్లో అందరూ అతని రాక కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. అయితే ప్రత్యేక సౌకర్యాలు ఏవీ ఉండవని, అందరికీ ఉన్న సదుపాయాలే వైభవ్కు ఉంటాయని స్పష్టం చేశారు. “ఇది క్రికెట్ పిచ్ కాదు, చదువు పిచ్” అని ఆయన చెప్పిన మాట అందరినీ ఆకట్టుకుంది.
READ MORE: Iran Video: ‘‘ఖమేనీ డెత్’’ అంటూ నోరు జారిన రిపోర్టర్.. టీవీ ఛానల్స్ సిబ్బంది తొలగింపు
వైభవ్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రపంచకప్ ఫైనల్లో వైభవ్ 175 పరుగుల ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. 15 ఫోర్లు, 15 సిక్సర్లతో ఆడిన ఆ ఇన్నింగ్స్ అండర్-19 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డుగా నిలిచింది. ఈ టోర్నీలో మొత్తం 439 పరుగులు చేసి రెండో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఏడు మ్యాచ్ల్లో ఒక శతకం, మూడు అర్ధశతకాలు సాధించి తన సత్తా చాటాడు. మొత్తం 30 సిక్సులు కొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. అండర్-19 వన్డేల్లోనూ వైభవ్ ప్రదర్శన అద్భుతం. ఇప్పటివరకు 25 ఇన్నింగ్స్లో 1,412 పరుగులు చేశాడు. సగటు 56కి పైగా, స్ట్రైక్ రేట్ 165కి పైగా ఉంది. నాలుగు శతకాలు, ఏడు అర్ధశతకాలు సాధించాడు. అతని అత్యధిక స్కోర్ 175 పరుగులే. అయితే.. ఇప్పడు చదువు పరీక్షలో నెగ్గుతాడా? లేదా? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
