NTV Telugu Site icon

Adluri Laxman : కొప్పుల ఈశ్వర్ మాటలు సత్యదూరమైనవి

Adluri Laxman

Adluri Laxman

జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిన్న ప్రెస్ మీట్‌ పెట్టి అనేక అంశాల పైన సత్యదూరమైన ఆరోపణలు చేయడం జరిగిందన్నారు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. గతంలో కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం వణికిపోతుంటే బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో కనీసం అట్టి కరోనా వ్యాధిని ఆరోగ్య శ్రీ లో చేర్చలేదని, మన ప్రాంతానికి చెందిన ఎంతో మంది ప్రజలు కరోనా బారిన పడి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్తే బెడ్స్ దొరకని పరిస్థితి ఉండేదని, మన ప్రాంతానికి చెందిన ఎంతమంది కరోనా బాధితులను ఆదుకున్నారో కొప్పుల ఈశ్వర్ చెప్పాలన్నారు అడ్లూరి లక్ష్మణ్‌.

 Assembly Committee : అసెంబ్లీ కమిటీలను నియమించిన స్పీకర్‌

అంతేకాకుండా..’జ్వరాలు ప్రబలకుండా అధికారులు,గ్రామ గ్రామాన అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది.ఎప్పటికప్పుడు నివేదికలను ప్రభుత్వంకి పంపించడం జరుగుతుంది. ధర్మపురి లోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాను. మీలాగ కరోనా వస్తే ప్రజలను గాలికి వదిలేయలేదు,ధర్మపురిలో మాత శిశు ఆసుపత్రి పనులు 80% పూర్తి చేసి 20% పనులు పెండింగ్లో పెట్టారో సమాధానం చెప్పాలి. కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్న సమయంలో ధర్మపురిలోని ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ICI యూనిట్ కి సంబంధించిన వైద్య పరికరాలను గదిలో పెట్టీ తాళం వేయడం జరిగింది. రాష్ట్ర ఖజనాను మొత్తం ఖాళీ చేసి రాష్ట్రాన్ని మాకు అప్పగించినప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

 Assembly Committee : అసెంబ్లీ కమిటీలను నియమించిన స్పీకర్‌

జిల్లా కలెక్టర్ మాట్లాడి త్వరలోనే ధర్మపురిలో మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేస్తాం. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నావు కదా మరి ఎందుకు పెద్దపూర్ సంక్షేమ హాస్టల్ కి వెళ్ళలేదు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి తరహాలో ఎందుకు ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయలేకపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం వరదల్లో నష్టపోయి ఆస్తినష్టం వాటిల్లిన ప్రతి ఒక్కరికీ 17,500 రూపాయల నష్ట పరిహారం ప్రకటించడం జరిగింది. వర్ష కాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.’ అని వడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు.