Site icon NTV Telugu

Vaddiraju Ravichandra : బీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర

Vaddiraju

Vaddiraju

వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ స్థానానికి కేసీఆర్ నామినేట్ చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరును బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు ప్రతిపాదించారు. బుధవారం పార్టీ సీనియర్ నేతలతో చర్చించి రవిచంద్ర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రవిచంద్ర గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారత ఎన్నికల సంఘం తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తోంది, వీటికి ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ పత్రాల దాఖలుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ. బీఆర్‌ఎస్‌ ఎంపీలు జే సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండడంతో మూడు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి.

 
Anil Kumar Yadav: నా రాజకీయ జీవితం జగన్ పెట్టిన భిక్ష.. ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేస్తా..
 

ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో కాంగ్రెస్ రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించగా, అసెంబ్లీలో తమకున్న బలం ఆధారంగా బీఆర్‌ఎస్ మూడో స్థానం కోసం పోటీ చేయాలని నిర్ణయించుకుంది. వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) తెలంగాణకు చెందిన గ్రానైట్ వ్యాపారవేత్త. ఆయన 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరాడు. రవిచంద్రను 2022 బీఆర్ఎస్ రాజ్యస‌భ సభ్యుడిగా ఖరారు చేసింది. ఈ రాజ్య సభ ఉప ఎన్నికలో ఒక నామినేషన్‌ దాఖలు కావడంతో రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. రాజ్యసభ నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇందులో తెలంగాణ నుంచి మూడు ఖాళీలు ఉన్నాయి.

 

Exit mobile version