Suicide: ఫ్రొఫెసర్ల వేధింపులు.. హాస్టల్ గదిలో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రొఫెసర్ల వేధింపులతో ఓ జూనియర్ డాక్టర్ నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న జూనియర్ డాక్టర్ దివేష్ గార్గ్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఒక ప్రొఫెసర్ తన కొడుకు థీసిస్ను రెండుసార్లు తిరస్కరించాడని.. ప్రొఫెసర్లు నిరంతరం వేధింపులకు పాల్పడటంతోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
డెహ్రాడూన్లోని శ్రీ గురురామ్ రాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్లో డాక్టర్ దివేష్ గార్గ్ (26) పీడియాట్రిక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మే 17న తన హాస్టల్ గదిలో శవమై కనిపించాడు. ఈ ఘటనలో డాక్టర్ ఉత్కర్ష్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గార్గ్ మరణానికి సంబంధించి IPC సెక్షన్ 306 కింద పీడియాట్రిక్స్ విభాగం అధిపతి శర్మ, ప్రొఫెసర్లు ఆశిష్ సేథి, బిందు అగర్వాల్ పై కేసు నమోదు చేశారు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. ఇద్దరు టాలీవుడ్ నటుల బ్లడ్లో డ్రగ్స్?
తన కొడుకు అక్టోబర్ 2023లో కాలేజీలో చేరాడని.. కొన్ని రోజుల తర్వాత ఉత్కర్ష్ శర్మ, ఆశిష్ సేథీ, బిందు అగర్వాల్ మరియు మేనేజ్మెంట్ కమిటీ తన కొడుకును వేధించడం మొదలుపెట్టారని మృతుడి తండ్రి తెలిపాడు. 104-డిగ్రీల జ్వరంతో ఉన్న కూడా అతనిని 36 గంటల షిఫ్ట్లలో పని చేసేలా చేసారన్నాడు. ఆ విషయం తన కొడుకు తనతో చెప్పాడని తెలిపాడు. అంతేకాకుండా.. ఉత్కర్ష్ శర్మ తన థీసిస్ని రెండుసార్లు తిరస్కరించాడని, ఉత్తీర్ణత కోసం 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని.. బిందు అగర్వాల్ తన కొడుకును మానసికంగా వేధించిందని మృతుడి తండ్రి ఆరోపించాడు
అయితే.. మే 17న ఉదయం 10 గంటలకు తన కొడుకు ఫోన్ చేసినట్లు తండ్రి చెప్పాడు. ‘నన్ను తీసుకెళ్లండి, లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను’ అని చెప్పాడన్నాడు. అయితే.. తాము మరుసటి రోజు తనను తీసుకురావడానికి వస్తామని, ఏమీ చేసుకోవద్దని చేప్పినట్లు తండ్రి చెప్పాడు. కానీ.. అదే రోజు రాత్రి తనకు కాల్ వచ్చిందని.. ఉత్కర్ష్ శర్మ అనే వ్యక్తి తన కొడుకును ఎమర్జెన్సీ వార్డులో చేర్చారని రమేష్ గార్గ్ చెప్పాడన్నాడు. రాత్రి 10:40 గంటలకు, తన కొడుకు మృతదేహం మార్చురీలో ఉందని మరో కాల్ వచ్చిందని తెలిపాడు. తన కొడుకు మరణం కుట్ర కోణమేనని తండ్రి ఆరోపించాడు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!