Uttarpradesh: యూపీలో కాంగ్రెస్కు మరో దెబ్బ.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అజయ్ కపూర్ బీజేపీలో చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh: కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. టిక్కెట్ల ఖరారు కోసం ఇప్పటికే ఒక రౌండ్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. రెండో విడత సమావేశం కూడా ఈ వారంలోనే జరగొచ్చు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే వీటన్నింటి మధ్య ఎన్నికల్లో పోటీ చేసేందుకు పేర్లు వినిపించిన వారంత పార్టీని వీడడం ఒకింత కలవర పెడుతోంది. ఈ క్రమంలో నేడు యూపీలో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలిందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అజయ్ కపూర్ నేడు బీజేపీలో చేరనున్నారు.
అజయ్ కపూర్ ఎవరు?
అజయ్ కపూర్ బీహార్ కో-ఇన్చార్జ్గా కూడా ఉన్నారు. యూపీ కాంగ్రెస్లోని పెద్ద నాయకుల్లో ఒకరిగా ఆయనకు పేరుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సన్నిహితంగా ఉండే నాయకుల్లో అజయ్ కపూర్ కూడా ఉన్నారు. ఒకప్పుడు కాన్పూర్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. అజయ్ కపూర్ స్వయంగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గోవింద్ నగర్ నుంచి రెండుసార్లు, కిద్వాయ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కాన్పూర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆయన వాదన. యూపీలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు ఉంది. కూటమిలోని కాన్పూర్ సీటు కాంగ్రెస్కు దక్కింది.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
Read Also:Virat Kohli-IPL 2024: ఆర్సీబీకి శుభవార్త.. ‘కింగ్’ కోహ్లీ వచ్చేస్తున్నాడు!
కాన్పూర్లో గత ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. శ్రీప్రకాష్ జైస్వాల్, అజయ్ కపూర్ ఈ గ్రూపులకు నాయకులు. జైస్వాల్ ఢిల్లీ రాజకీయాలు, యూపీలో కపూర్ రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. జైస్వాల్ గ్రూప్ బలహీనంగా మారడంతో కపూర్ ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు ఆయన ఢిల్లీలో బీజేపీలో చేరారు. యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా ఆయనకు స్వయానా బంధువు. కాన్పూర్ నుంచి బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ప్రస్తుతం అక్కడి నుంచి బీజేపీ ఎంపీగా సత్యదేవ్ పచౌరీ ఉన్నారు.
ఎంత ఆస్తి ఉంది?
ఇక అజయ్ కపూర్ ఆస్తుల గురించి మాట్లాడితే.. గత ఎన్నికల్లో ఆయన నామినేషన్ వేసే సమయంలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన మొత్తం ఆస్తులు దాదాపు రూ.69 కోట్లు. అయితే గత 15 ఏళ్లలో ఆయన సంపద దాదాపు 14 రెట్లు పెరిగిందని కూడా చెబుతున్నారు. 2007లో నామినేషన్ సందర్భంగా ఆయన తన మొత్తం ఆస్తులను రూ.5.28 కోట్లుగా ప్రకటించారు. కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ సందర్భంగా ఆయన తన ఆస్తులను రూ.31.39 కోట్లుగా ప్రకటించారు.
Read Also:Free Haleem Case: హోటల్ కొంప ముంచిన ‘ఫ్రీ హలీమ్ ఆఫర్.. లాఠీలకు పని చెప్పిన పోలీసులు
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!