Uttarpradesh: యూపీలో కాంగ్రెస్కు మరో దెబ్బ.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అజయ్ కపూర్ బీజేపీలో చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh: కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. టిక్కెట్ల ఖరారు కోసం ఇప్పటికే ఒక రౌండ్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. రెండో విడత సమావేశం కూడా ఈ వారంలోనే జరగొచ్చు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే వీటన్నింటి మధ్య ఎన్నికల్లో పోటీ చేసేందుకు పేర్లు వినిపించిన వారంత పార్టీని వీడడం ఒకింత కలవర పెడుతోంది. ఈ క్రమంలో నేడు యూపీలో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలిందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అజయ్ కపూర్ నేడు బీజేపీలో చేరనున్నారు.
అజయ్ కపూర్ ఎవరు?
అజయ్ కపూర్ బీహార్ కో-ఇన్చార్జ్గా కూడా ఉన్నారు. యూపీ కాంగ్రెస్లోని పెద్ద నాయకుల్లో ఒకరిగా ఆయనకు పేరుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సన్నిహితంగా ఉండే నాయకుల్లో అజయ్ కపూర్ కూడా ఉన్నారు. ఒకప్పుడు కాన్పూర్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. అజయ్ కపూర్ స్వయంగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గోవింద్ నగర్ నుంచి రెండుసార్లు, కిద్వాయ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కాన్పూర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆయన వాదన. యూపీలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు ఉంది. కూటమిలోని కాన్పూర్ సీటు కాంగ్రెస్కు దక్కింది.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Read Also:Virat Kohli-IPL 2024: ఆర్సీబీకి శుభవార్త.. ‘కింగ్’ కోహ్లీ వచ్చేస్తున్నాడు!
కాన్పూర్లో గత ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. శ్రీప్రకాష్ జైస్వాల్, అజయ్ కపూర్ ఈ గ్రూపులకు నాయకులు. జైస్వాల్ ఢిల్లీ రాజకీయాలు, యూపీలో కపూర్ రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. జైస్వాల్ గ్రూప్ బలహీనంగా మారడంతో కపూర్ ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు ఆయన ఢిల్లీలో బీజేపీలో చేరారు. యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా ఆయనకు స్వయానా బంధువు. కాన్పూర్ నుంచి బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ప్రస్తుతం అక్కడి నుంచి బీజేపీ ఎంపీగా సత్యదేవ్ పచౌరీ ఉన్నారు.
ఎంత ఆస్తి ఉంది?
ఇక అజయ్ కపూర్ ఆస్తుల గురించి మాట్లాడితే.. గత ఎన్నికల్లో ఆయన నామినేషన్ వేసే సమయంలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన మొత్తం ఆస్తులు దాదాపు రూ.69 కోట్లు. అయితే గత 15 ఏళ్లలో ఆయన సంపద దాదాపు 14 రెట్లు పెరిగిందని కూడా చెబుతున్నారు. 2007లో నామినేషన్ సందర్భంగా ఆయన తన మొత్తం ఆస్తులను రూ.5.28 కోట్లుగా ప్రకటించారు. కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ సందర్భంగా ఆయన తన ఆస్తులను రూ.31.39 కోట్లుగా ప్రకటించారు.
Read Also:Free Haleem Case: హోటల్ కొంప ముంచిన ‘ఫ్రీ హలీమ్ ఆఫర్.. లాఠీలకు పని చెప్పిన పోలీసులు
తాజావార్తలు
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!