Uttarpradesh: యూపీలో కాంగ్రెస్కు మరో దెబ్బ.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అజయ్ కపూర్ బీజేపీలో చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh: కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. టిక్కెట్ల ఖరారు కోసం ఇప్పటికే ఒక రౌండ్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. రెండో విడత సమావేశం కూడా ఈ వారంలోనే జరగొచ్చు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే వీటన్నింటి మధ్య ఎన్నికల్లో పోటీ చేసేందుకు పేర్లు వినిపించిన వారంత పార్టీని వీడడం ఒకింత కలవర పెడుతోంది. ఈ క్రమంలో నేడు యూపీలో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలిందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అజయ్ కపూర్ నేడు బీజేపీలో చేరనున్నారు.
అజయ్ కపూర్ ఎవరు?
అజయ్ కపూర్ బీహార్ కో-ఇన్చార్జ్గా కూడా ఉన్నారు. యూపీ కాంగ్రెస్లోని పెద్ద నాయకుల్లో ఒకరిగా ఆయనకు పేరుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సన్నిహితంగా ఉండే నాయకుల్లో అజయ్ కపూర్ కూడా ఉన్నారు. ఒకప్పుడు కాన్పూర్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. అజయ్ కపూర్ స్వయంగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గోవింద్ నగర్ నుంచి రెండుసార్లు, కిద్వాయ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కాన్పూర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆయన వాదన. యూపీలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు ఉంది. కూటమిలోని కాన్పూర్ సీటు కాంగ్రెస్కు దక్కింది.
Also Read
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
Read Also:Virat Kohli-IPL 2024: ఆర్సీబీకి శుభవార్త.. ‘కింగ్’ కోహ్లీ వచ్చేస్తున్నాడు!
కాన్పూర్లో గత ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. శ్రీప్రకాష్ జైస్వాల్, అజయ్ కపూర్ ఈ గ్రూపులకు నాయకులు. జైస్వాల్ ఢిల్లీ రాజకీయాలు, యూపీలో కపూర్ రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. జైస్వాల్ గ్రూప్ బలహీనంగా మారడంతో కపూర్ ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు ఆయన ఢిల్లీలో బీజేపీలో చేరారు. యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా ఆయనకు స్వయానా బంధువు. కాన్పూర్ నుంచి బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ప్రస్తుతం అక్కడి నుంచి బీజేపీ ఎంపీగా సత్యదేవ్ పచౌరీ ఉన్నారు.
ఎంత ఆస్తి ఉంది?
ఇక అజయ్ కపూర్ ఆస్తుల గురించి మాట్లాడితే.. గత ఎన్నికల్లో ఆయన నామినేషన్ వేసే సమయంలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన మొత్తం ఆస్తులు దాదాపు రూ.69 కోట్లు. అయితే గత 15 ఏళ్లలో ఆయన సంపద దాదాపు 14 రెట్లు పెరిగిందని కూడా చెబుతున్నారు. 2007లో నామినేషన్ సందర్భంగా ఆయన తన మొత్తం ఆస్తులను రూ.5.28 కోట్లుగా ప్రకటించారు. కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ సందర్భంగా ఆయన తన ఆస్తులను రూ.31.39 కోట్లుగా ప్రకటించారు.
Read Also:Free Haleem Case: హోటల్ కొంప ముంచిన ‘ఫ్రీ హలీమ్ ఆఫర్.. లాఠీలకు పని చెప్పిన పోలీసులు
తాజావార్తలు
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!