Uttarpradesh: యూపీలో కాంగ్రెస్కు మరో దెబ్బ.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అజయ్ కపూర్ బీజేపీలో చేరిక
Uttarpradesh: కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. టిక్కెట్ల ఖరారు కోసం ఇప్పటికే ఒక రౌండ్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. రెండో విడత సమావేశం కూడా ఈ వారంలోనే జరగొచ్చు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే వీటన్నింటి మధ్య ఎన్నికల్లో పోటీ చేసేందుకు పేర్లు వినిపించిన వారంత పార్టీని వీడడం ఒకింత కలవర పెడుతోంది. ఈ క్రమంలో నేడు యూపీలో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలిందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అజయ్ కపూర్ నేడు బీజేపీలో చేరనున్నారు.
అజయ్ కపూర్ ఎవరు?
అజయ్ కపూర్ బీహార్ కో-ఇన్చార్జ్గా కూడా ఉన్నారు. యూపీ కాంగ్రెస్లోని పెద్ద నాయకుల్లో ఒకరిగా ఆయనకు పేరుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సన్నిహితంగా ఉండే నాయకుల్లో అజయ్ కపూర్ కూడా ఉన్నారు. ఒకప్పుడు కాన్పూర్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. అజయ్ కపూర్ స్వయంగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గోవింద్ నగర్ నుంచి రెండుసార్లు, కిద్వాయ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కాన్పూర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆయన వాదన. యూపీలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు ఉంది. కూటమిలోని కాన్పూర్ సీటు కాంగ్రెస్కు దక్కింది.
Also Read
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Read Also:Virat Kohli-IPL 2024: ఆర్సీబీకి శుభవార్త.. ‘కింగ్’ కోహ్లీ వచ్చేస్తున్నాడు!
కాన్పూర్లో గత ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. శ్రీప్రకాష్ జైస్వాల్, అజయ్ కపూర్ ఈ గ్రూపులకు నాయకులు. జైస్వాల్ ఢిల్లీ రాజకీయాలు, యూపీలో కపూర్ రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. జైస్వాల్ గ్రూప్ బలహీనంగా మారడంతో కపూర్ ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు ఆయన ఢిల్లీలో బీజేపీలో చేరారు. యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా ఆయనకు స్వయానా బంధువు. కాన్పూర్ నుంచి బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ప్రస్తుతం అక్కడి నుంచి బీజేపీ ఎంపీగా సత్యదేవ్ పచౌరీ ఉన్నారు.
ఎంత ఆస్తి ఉంది?
ఇక అజయ్ కపూర్ ఆస్తుల గురించి మాట్లాడితే.. గత ఎన్నికల్లో ఆయన నామినేషన్ వేసే సమయంలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన మొత్తం ఆస్తులు దాదాపు రూ.69 కోట్లు. అయితే గత 15 ఏళ్లలో ఆయన సంపద దాదాపు 14 రెట్లు పెరిగిందని కూడా చెబుతున్నారు. 2007లో నామినేషన్ సందర్భంగా ఆయన తన మొత్తం ఆస్తులను రూ.5.28 కోట్లుగా ప్రకటించారు. కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ సందర్భంగా ఆయన తన ఆస్తులను రూ.31.39 కోట్లుగా ప్రకటించారు.
Read Also:Free Haleem Case: హోటల్ కొంప ముంచిన ‘ఫ్రీ హలీమ్ ఆఫర్.. లాఠీలకు పని చెప్పిన పోలీసులు
తాజావార్తలు
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?