Uttam Kumar Reddy : ప్రాధాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలి
- ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష
- ప్రాధాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : ప్రాజెక్టులు , రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీత పనులను తక్షణం ప్రారంభించాలని నీటిపారుదల , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పనుల కోసం అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని సూచించారు. పూడికతీత పనుల్లో ఆలస్యం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ , ఆర్థిక వృద్ధి కోసం నీటిపారుదల ప్రాజెక్టులు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయని, వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
IPL 2025 Mega Auction: మెగా వేలంలో అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీపై కనక వర్షం..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
సీతారామ ప్రాజెక్టు టెండర్ల పనులను వేగవంతం చేసి, ప్రాజెక్టు పనుల్లో అనుమతులు లేదా పరిపాలన సంబంధిత జాప్యాలు రాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మోడికుంట వాగు అంచనాలను రూపొందించడంతో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భూ సేకరణలో ఏర్పడే సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు రీలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కమిషనర్తో సమన్వయం చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. భూ సేకరణకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 27న సింగూరు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ కూడా పాల్గొంటారని వివరించారు.
Ramdas Athawale: ఫడ్నవిస్ సీఎం అయ్యే ఛాన్స్.. కేంద్రమంత్రి వ్యాఖ్య
డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా, నల్గొండ జిల్లాకు చెందిన ప్రాజెక్టుల పురోగతి, నిధుల అవసరాలు, భూసేకరణలో ఎదురవుతున్న అడ్డంకులు వంటి అంశాలపై పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నీటిపారుదల శాఖలో లష్కర్ నియామకంతో పాటు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?