Uttam Kumar Reddy : ప్రాధాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలి
- ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష
- ప్రాధాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : ప్రాజెక్టులు , రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీత పనులను తక్షణం ప్రారంభించాలని నీటిపారుదల , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పనుల కోసం అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని సూచించారు. పూడికతీత పనుల్లో ఆలస్యం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ , ఆర్థిక వృద్ధి కోసం నీటిపారుదల ప్రాజెక్టులు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయని, వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
IPL 2025 Mega Auction: మెగా వేలంలో అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీపై కనక వర్షం..
Also Read
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
- FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
సీతారామ ప్రాజెక్టు టెండర్ల పనులను వేగవంతం చేసి, ప్రాజెక్టు పనుల్లో అనుమతులు లేదా పరిపాలన సంబంధిత జాప్యాలు రాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మోడికుంట వాగు అంచనాలను రూపొందించడంతో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భూ సేకరణలో ఏర్పడే సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు రీలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కమిషనర్తో సమన్వయం చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. భూ సేకరణకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 27న సింగూరు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ కూడా పాల్గొంటారని వివరించారు.
Ramdas Athawale: ఫడ్నవిస్ సీఎం అయ్యే ఛాన్స్.. కేంద్రమంత్రి వ్యాఖ్య
డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా, నల్గొండ జిల్లాకు చెందిన ప్రాజెక్టుల పురోగతి, నిధుల అవసరాలు, భూసేకరణలో ఎదురవుతున్న అడ్డంకులు వంటి అంశాలపై పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నీటిపారుదల శాఖలో లష్కర్ నియామకంతో పాటు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే..”కాక్రోచ్ జనతా పార్టీ” ఫ్లాప్ షో..
-
FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!