Uttam Kumar Reddy : ప్రాధాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలి
- ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష
- ప్రాధాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : ప్రాజెక్టులు , రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీత పనులను తక్షణం ప్రారంభించాలని నీటిపారుదల , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పనుల కోసం అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని సూచించారు. పూడికతీత పనుల్లో ఆలస్యం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ , ఆర్థిక వృద్ధి కోసం నీటిపారుదల ప్రాజెక్టులు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయని, వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
IPL 2025 Mega Auction: మెగా వేలంలో అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీపై కనక వర్షం..
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
సీతారామ ప్రాజెక్టు టెండర్ల పనులను వేగవంతం చేసి, ప్రాజెక్టు పనుల్లో అనుమతులు లేదా పరిపాలన సంబంధిత జాప్యాలు రాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మోడికుంట వాగు అంచనాలను రూపొందించడంతో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భూ సేకరణలో ఏర్పడే సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు రీలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కమిషనర్తో సమన్వయం చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. భూ సేకరణకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 27న సింగూరు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ కూడా పాల్గొంటారని వివరించారు.
Ramdas Athawale: ఫడ్నవిస్ సీఎం అయ్యే ఛాన్స్.. కేంద్రమంత్రి వ్యాఖ్య
డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా, నల్గొండ జిల్లాకు చెందిన ప్రాజెక్టుల పురోగతి, నిధుల అవసరాలు, భూసేకరణలో ఎదురవుతున్న అడ్డంకులు వంటి అంశాలపై పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నీటిపారుదల శాఖలో లష్కర్ నియామకంతో పాటు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!