Uttam Kumar Reddy : ప్రాధాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలి
- ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష
- ప్రాధాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : ప్రాజెక్టులు , రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీత పనులను తక్షణం ప్రారంభించాలని నీటిపారుదల , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పనుల కోసం అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని సూచించారు. పూడికతీత పనుల్లో ఆలస్యం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ , ఆర్థిక వృద్ధి కోసం నీటిపారుదల ప్రాజెక్టులు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయని, వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
IPL 2025 Mega Auction: మెగా వేలంలో అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీపై కనక వర్షం..
Also Read
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
సీతారామ ప్రాజెక్టు టెండర్ల పనులను వేగవంతం చేసి, ప్రాజెక్టు పనుల్లో అనుమతులు లేదా పరిపాలన సంబంధిత జాప్యాలు రాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మోడికుంట వాగు అంచనాలను రూపొందించడంతో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భూ సేకరణలో ఏర్పడే సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు రీలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కమిషనర్తో సమన్వయం చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. భూ సేకరణకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 27న సింగూరు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ కూడా పాల్గొంటారని వివరించారు.
Ramdas Athawale: ఫడ్నవిస్ సీఎం అయ్యే ఛాన్స్.. కేంద్రమంత్రి వ్యాఖ్య
డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా, నల్గొండ జిల్లాకు చెందిన ప్రాజెక్టుల పురోగతి, నిధుల అవసరాలు, భూసేకరణలో ఎదురవుతున్న అడ్డంకులు వంటి అంశాలపై పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నీటిపారుదల శాఖలో లష్కర్ నియామకంతో పాటు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!