US Airstrike On Syria: సిరియాపై అమెరికా వైమానిక దాడి.. సీనియర్ ఉగ్రవాది హతం
- సిరియాపై అమెరికా వైమానిక దాడి.
- దాడిలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్ హతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Airstrike On Syria: సిరియాలోని వాయువ్య ప్రాంతంలో గురువారం జరిగిన వైమానిక దాడిలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్ను అమెరికా సైన్యం హతమార్చింది. తీవ్రవాద గ్రూపులను నాశనం చేసి వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ వైమానిక దాడి జరిగిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. జబీర్ అల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన హుర్రాస్ అల్-దిన్ అనే గ్రూప్తో అతను సంబంధం కలిగి ఉన్నాడు.
Also Read: Champions Trophy 2025: హమ్మయ్య.. పాకిస్థాన్కు రోహిత్ వెళ్లాల్సిన అవసరం లేదు!
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ గురువారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తమ సైనిక చీఫ్ మహ్మద్ దైఫ్ మరణించినట్లు ధృవీకరించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకటించిన నెలల తర్వాత ఈ నిర్ధారణ వచ్చింది. నివేదిక ప్రకారం, హమాస్ ప్రతినిధి అబు ఒబైదా వీడియో ప్రకటనలో దైఫ్ మరణాన్ని ధృవీకరించారు. జూలై 13న ఖాన్ యునిస్ ప్రాంతంలో వైమానిక దాడిలో మహ్మద్ దైఫ్ను చంపినట్లు ఇజ్రాయెల్ ఆగస్టు 2023లో ప్రకటించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్పై దాడి చేయడంతో 1200 మందికి పైగా మరణించారు. వారిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారు. అంతేకాకుండా వందల మంది కిడ్నాప్కు గురయ్యారు. దీని తరువాత, ఇజ్రాయెల్ హమాస్కు ప్రతీకారంగా గాజాలో 46000 మందికి పైగా పాలస్తీనియన్లను మట్టుపెట్టింది.
ఇటీవల గాజాలో ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం బందీలు, ఖైదీల మార్పిడి జరిగింది. గురువారం నాడు 110 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా ఇజ్రాయెల్ నుండి 8 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. వీరిలో ఐదుగురు థాయ్ వ్యవసాయ కార్మికులు, ముగ్గురు జర్మన్-ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!