UPSC: సివిల్స్-2022 తుది ఫలితాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2022 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా 933 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది. 933 మందిలో ఐఏఎస్ సర్వీసెస్కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే ఐఎఫ్ఎస్కు 38 మందిని, ఐపీఎస్కు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-ఏకు 473 మందిని, గ్రూప్-బీకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-బీ కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. జనరల్ కేటగిరీ కింద 345 మందిని, ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి 99 మందిని, ఓబీసీ కేటగిరీ కింద 263 మందిని, ఎస్సీ కేటగిరీ కింద 154 మందిని, ఎస్టీ వర్గం నుంచి 72 మందిని ఎంపిక చేసింది.
పర్సనాలిటీ టెస్ట్కు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ – upsc.gov.inలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం కూడా మహిళలే టాప్లో నిలిచారు. ఫలితాల్లో ఇషితా కిషోర్ టాపర్గా నిలవగా.. గరిమా లోహియా రెండో స్థానం, ఉమా హాథిన్ మూడో స్థానం, స్మృతి మిశ్రా నాలుగో స్థానం, మయూర్ హజారికా ఐదో స్థానం దక్కించుకున్నారు. గత సంవత్సరం, శ్రుతి శర్మ తుది ఫలితంలో ఆల్ ఇండియా ర్యాంక్ 1ని సాధించింది. మొదటి మూడు స్థానాలను బాలికలే దక్కించుకున్నారు. అంకితా అగర్వాల్ ర్యాంక్ 2, చండీగఢ్కు చెందిన గామిని సింగ్లా 3 ర్యాంక్ సాధించారు. ఇదిలా ఉండగా.. యూపీఎస్సీ మే 28న సివిల్స్ సర్వీసెస్ పరీక్ష- 2023 ప్రిలిమ్స్ను నిర్వహించనుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్లు అధికారిక వెబ్సైట్లో విడుదల చేయబడ్డాయి.
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సర్వీసులలో అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరోసారి ప్రతిభ చూపించారు. పవన్ దత్త- ర్యాంక్ 22, హెచ్ఎస్ భావన – ర్యాంక్ 55, అరుణవ్ మిశ్రా-56, సాయి ప్రణవ్-60, నిధి పాయ్- 110, రుహాని- 159 తో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకులను సాధించారు.
రిజల్ట్ లింక్ ఇదే- క్లిక్ చేయండి
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!