UPSC: సివిల్స్-2022 తుది ఫలితాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2022 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా 933 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది. 933 మందిలో ఐఏఎస్ సర్వీసెస్కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే ఐఎఫ్ఎస్కు 38 మందిని, ఐపీఎస్కు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-ఏకు 473 మందిని, గ్రూప్-బీకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-బీ కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. జనరల్ కేటగిరీ కింద 345 మందిని, ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి 99 మందిని, ఓబీసీ కేటగిరీ కింద 263 మందిని, ఎస్సీ కేటగిరీ కింద 154 మందిని, ఎస్టీ వర్గం నుంచి 72 మందిని ఎంపిక చేసింది.
పర్సనాలిటీ టెస్ట్కు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ – upsc.gov.inలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం కూడా మహిళలే టాప్లో నిలిచారు. ఫలితాల్లో ఇషితా కిషోర్ టాపర్గా నిలవగా.. గరిమా లోహియా రెండో స్థానం, ఉమా హాథిన్ మూడో స్థానం, స్మృతి మిశ్రా నాలుగో స్థానం, మయూర్ హజారికా ఐదో స్థానం దక్కించుకున్నారు. గత సంవత్సరం, శ్రుతి శర్మ తుది ఫలితంలో ఆల్ ఇండియా ర్యాంక్ 1ని సాధించింది. మొదటి మూడు స్థానాలను బాలికలే దక్కించుకున్నారు. అంకితా అగర్వాల్ ర్యాంక్ 2, చండీగఢ్కు చెందిన గామిని సింగ్లా 3 ర్యాంక్ సాధించారు. ఇదిలా ఉండగా.. యూపీఎస్సీ మే 28న సివిల్స్ సర్వీసెస్ పరీక్ష- 2023 ప్రిలిమ్స్ను నిర్వహించనుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్లు అధికారిక వెబ్సైట్లో విడుదల చేయబడ్డాయి.
Also Read
- Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
- BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సర్వీసులలో అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరోసారి ప్రతిభ చూపించారు. పవన్ దత్త- ర్యాంక్ 22, హెచ్ఎస్ భావన – ర్యాంక్ 55, అరుణవ్ మిశ్రా-56, సాయి ప్రణవ్-60, నిధి పాయ్- 110, రుహాని- 159 తో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకులను సాధించారు.
రిజల్ట్ లింక్ ఇదే- క్లిక్ చేయండి
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!