UP: కూర వండలేదని కోప్పడ్డాడు.. తల్లి చేసిన పనికి కొడుకు ఏం చేశాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఇంట్లో గొడవలతో తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుకు తనకు ఇష్టమైన కూర వండలేదని తల్లితో గొడవ పెట్టుకున్నాడు. తల్లీ కొడుకుల మృతి ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. తల్లీ కొడుకుల మృతదేహాలను స్వాధీనంలోకి తీసుకుని పోస్ట్మార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also:Bandi Sanjay: ఈనెల 6న బండి సంజయ్ నామినేషన్.. 8 నుంచి సుడిగాలి పర్యటన
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
ఒరై కొత్వాలి ప్రాంతానికి చెందిన సుశీల్ నగర్లో నివాసముండే దిగ్విజయ్ సింగ్ (28) పరీక్ష రాసి శనివారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. అతని తల్లి బేబీ చౌహాన్ (55) ఇంట్లో ఉంది. దిగ్విజయ్ తన తల్లిని తనకు ఇష్టమైన కూరగాయను వండమని అడిగాడు. అప్పటికే తల్లి కూర వండేసింది. ఇంట్లో ఇద్దరు మాత్రమే తినే వాళ్లు ఉండడంతో తయారు చేసేందుకు నిరాకరించింది. అవసరం అయితే ఉదయం తనకు ఇష్టమైన కూర వండుతానని చెప్పింది. ఈ విషయమై తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది.
Read Also:Bigg Boss Telugu7: టేస్టీ తేజ తొమ్మిది వారాలకు ఎంత తీసుకున్నాడో తెలుసా?
వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీని తర్వాత కొడుకు ఇంట్లో ఉంచిన వస్తువులను విసిరేయడం ప్రారంభించాడు. ఇది చూసి ఆగ్రహించిన తల్లి ఇంట్లో ఉన్న విషం తాగింది. దీంతో ఆమె పరిస్థితి విషమించడంతో పాటు స్పృహ కోల్పోయింది. దీంతో కొడుకు దిగ్విజయ్ భయపడిపోయాడు. తర్వాత ఏమీ ఆలోచించకుండా బాత్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు చూడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అపస్మారక స్థితిలో ఉన్న మహిళను, కొడుకు ఉరిలో వేలాడుతూ ఉండటాన్ని చూసిన ప్రజలు వెంటనే కుమారుడిని ఉచ్చులోంచి కిందకు దించి ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు ఇద్దరూ చనిపోయినట్లు ప్రకటించారు. తల్లీకొడుకుల మధ్య వంట విషయంలో గొడవ జరిగిందని, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని ఒరై కొత్వాలి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ వీరేంద్ర సింగ్ పటేల్ తెలిపారు. మహిళ ఓరై కాలువ విభాగంలో పనిచేస్తోంది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!