Gorakhpur Horror: ఆస్తి తగాదాలు.. తండ్రిని సుత్తితో చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorakhpur Horror: మానవ సంబంధాలు మంటగాలిసిపోతున్నాయి. తండ్రిబిడ్డలు, తల్లి కొడుకుల సంబంధాలు సైతం కనుమరుగైపోతున్నాయి. పగలు ప్రతీకారాలు మాత్రమే రాజ్యమేలుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో చోటు చేసుకున్న దారుణ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆస్తి తగాదాల కారణంగా తండ్రిని చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు ఓ కసాయి కొడుకు. కనిపెంచిన పాపానికి ఇలా తండ్రి రుణం తీర్చుకున్నాడు ఆ దుర్మార్గుడు. గోరఖ్పూర్ జిల్లా వాసి సంతోష్ కుమార్ గుప్తా (అలియాస్ ప్రిన్స్), ఆస్తి వివాదం కారణంగా అతని 62 ఏళ్ల తండ్రి మురళీ ధర్ గుప్తాను హత్య చేశాడు. హత్య తరువాత 30 ఏళ్ల నిందితుడు బాధితుడి మృతదేహాన్ని పారవేసేందుకు సూట్కేస్లో అమర్చడానికి ప్రయత్నించాడు. అందులో పట్టకపోవడంతో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఈ ఘటన తివారిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్ కుండ్ కాలనీలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఆదివారం నిందితుడి సోదరుడు ప్రశాంత్ గుప్తా ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేశారు.
ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తన తండ్రిని చంపినందుకు ప్రిన్స్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితుడి భార్య కొవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయింది. మురళీధర్ గుప్తా గ్రౌండ్ ఫ్లోర్లో జనరల్ స్టోర్ నడుపుతూ తన ఇంటి మొదటి అంతస్తులో ఉండేవాడు. బాధితుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు దాడి చేశాడు. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆపై సోదరుడి గది నుండి సూట్కేస్ తెచ్చి మృతదేహం ముక్కలను సూట్కేస్లో ఉంచి ఇంటి వెనుక వీధిలో దాచాడు. మరో కుమారుడు ప్రశాంత్ గుప్తా ఓ పెళ్లికి వెళ్లి రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకోగా.. ఇంట్లో రక్తపు మరకలు కనిపించాయి. అనంతరం అతడు పోలీసులకు సమాచారం అందించాడు. అతడి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
Also Read
Read Also: Akhilesh Yadav: సీఎం పర్యటనకు వెళ్తే మాఫియా స్వాగతం పలుకుతుంది.. అఖిలేష్ సంచలన కామెంట్స్
నిందితుడి సోదరుడి సమాచారం మేరకు పోలీసులు శరీర భాగాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారని అధికారి తెలిపారు. తదుపరి విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆస్తి విషయంలో తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. నిందితుడు ఇటీవల కొనుగోలు చేసిన మోటార్సైకిల్కు నెలవారీ ఈఎంఐ చెల్లించేందుకు మురళీ ధర్ గుప్తా నిరాకరించడంతో శనివారం రాత్రి పరిస్థితి విషమంగా మారింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!