Yogi Adityanath: అయోధ్య రామ మందిరం ప్రారంభానికి అందరూ రావాలి.. వేములవాడ ప్రజలకు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్య రామ మందిరం ప్రారంభానికి అందరూ రావాలని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ వేములవాడ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే జనవరిలో అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నామని, దానికి మీరంత రావాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా శనివారం ఉమ్మడి కరీంనగర్ రాజన్న సిరిసిల్లాలో బీజేపీ అభ్యర్థి వికాస్ రావు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు యోగి ఆదిత్య బహిరంగ సభలో ప్రసంగించారు.
‘టీఆర్ఎస్, కాంగ్రెస్తో జతకట్టి ప్రజలను మోసం చేయాలని చూస్తుంది. అధికార పార్టీ కుటుంబ పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటుంది. తెలంగాణ ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తూ, ముస్లింలతో జతకట్టి మోసం చేస్తుంది. గత 60 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం పేరిట పార్టీలు మోసం చేశాయని నీళ్లు, నిధులు నియామకాలు నినాదంతో అధికారంలోకి ప్రజలను మోసం చేసింది. బీఆర్ఎస్ అంటే బ్రస్టా చార్ పార్టీ. ఉత్తరప్రదేశ్లో ఆరు సంవత్సరాల క్రితం రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.. ఆ తర్వాత యూపీలో డబల్ ఇంజన్ సర్కార్తో ముందుకు వెళ్తున్నాం.
Also Read
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
- West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
- Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
లక్షల మంది నిరోద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. డబల్ ఇంజన్ సర్కార్ అంటే డబల్ స్పీడ్తో వెళ్లే ప్రభుత్వo.
ప్రధానమంత్రి మోడీ నేతృతంలో దేశంలో అందరూ తలెత్తుకునేలా చేసాడని, నయా భారత్ నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకెళ్తున్నారు. రతదేశంలో అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకెళ్తున్నామని అది నరేంద్ర మోడీతోనే సాధ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేసింది ఏమీ లేదని, బీజేపీ రైతుల కోసం సామాన్యుల కోసం ఏర్పాటు చేసిన పార్టీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఎజెండా ఒక్కటే.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారి ప్రజలను మోసం చేసింది. గత పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. వేములవాడ వికాసం కోసం గెలిపించాలి ఈసారి వికాస్ రావుకు అవకాశం ఇవ్వండి. కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు తెలంగాణ వేములవాడలో పోటీ చేస్తున్నాడు. వికాస్ రావును గెలిపించండి’ అని యోగి ఆదిత్యనాథ్ విజ్ఒప్తి చేశారు.
తాజావార్తలు
-
Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
-
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
-
West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
-
Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!