ViralVideo: ఛీఛీ చదువు చెప్పాల్సిన గురువే.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ViralVideo: గురువును దైవంగా భావించే దేశంలో, ఒక ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులను తన వ్యక్తిగత సేవలకు వాడుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సింది పోయి, విద్యార్థినుల చేత కాళ్లు పట్టించుకుంటున్న వీడియో బయటకు రావడంతో ఆ ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు పడింది. ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో వెలుగుచూసిన ఈ షాకింగ్ ఘటన విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
READ ALSO: Testosterone: పురుషుల ఆరోగ్య సీక్రెట్.. టెస్టోస్టిరాన్ పెంచే బెస్ట్ ఆహారాలు ఇవే!
Also Read
- APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. 'చంద్రన్న బోడిగుండు' అంటూ ప్లకార్డులు!
- Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
- 5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
- Vietnam Boat Tragedy: నేడు భారత్కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
అసలేం జరిగిందంటే..
చిత్రకూట్ జిల్లా నయా బజార్ ప్రాంతంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన వెలుగు చూసింది. వైరల్ అయిన 21 సెకన్ల వీడియోలో.. ప్రధానోపాధ్యాయురాలు మధు రాయ్ తరగతి గదిలోని నేలపై చాప వేసుకుని పడుకుని ఉంది. ఒక విద్యార్థిని ఆమె కాళ్లను మసాజ్ చేస్తూ కనిపిస్తుండగా, సదరు ఉపాధ్యాయురాలు మాత్రం దర్జాగా మొబైల్ ఫోన్ వాడుతూ సేద తీరుతోంది. ఈ వీడియో విద్యాశాఖలో కలకలం రేపడంతో, జిల్లా విద్యాధికారి (BSA) బి.కె.శర్మ తక్షణమే స్పందించారు. నగర విద్యాధికారి అతుల్ దత్ తివారీని విచారణకు ఆదేశించారు. ఆయన పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి వారి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. వీడియోలో ఉన్నది నిజమేనని తేలడంతో, ఆ నివేదిక ఆధారంగా మధు రాయ్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారలు ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులతో మసాజ్లు చేయించుకోవడం ఇదే మొదటిసారి కాదని, గత కొంతకాలంగా ఇదే సాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పిల్లలను చదువుకోనివ్వకుండా ఇలాంటి వ్యక్తిగత పనుల కోసం వాడుకుంటూ వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో జిల్లాలోని ఇతర ఉపాధ్యాయులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి క్రమశిక్షణారాహిత్య చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని ఉన్నతాధికారులు తెలిపారు.
READ ALSO: Ustaad Bhagat Singh: ఉగాదికి ‘ఉస్తాద్’ ఊచకోత.. డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్!
తాజావార్తలు
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!