NTV Telugu Site icon

Madhya pradesh: భార్యతో అసహజ శృంగారం అత్యాచారం కాదు.. హైకోర్టు కీలక తీర్పు

Kde

Kde

భార్యాభర్తల ధర్మాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యతో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. న్యాయస్థానం తీర్పుతో బాధితురాలికి షాక్ తగిలినట్లైంది. భర్త తనతో పలుమార్లు అసహజ శృంగారంలో పాల్గొన్నాడంటూ ఓ మహిళ కేసు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ మహిళ భర్త మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు మే 2019లో వివాహమైందని.. అయితే 2020 ఫిబ్రవరి నుంచి భార్య తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటుందని.. అంతేకాకుండా వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టిందని ఆ వ్యక్తి కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఇది గడిచిన రెండేళ్ల తర్వాత జులై 2022లో తన భర్త అసహజ సెక్స్‌కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆమె మరో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసు బుధవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సెక్షన్ 377 ప్రకారం.. భార్యాభర్తల మధ్య అసహజ శృంగారం అత్యాచారం కింద పరిగణించలేమని అతడి లాయర్ వాదించారు. వైవాహిక అత్యాచార ప్రస్తావన భారతీయ చట్టాల్లో లేదన్న మధ్యప్రదేశ్ హైకోర్టు.. 2019 నాటి కేసులో బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. అసహజ శృంగారం అత్యాచారం కాదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు.

ఇది కూడా చదవండి: Kerala : బాత్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. అమెజాన్ ప్యాకెట్‌లో పెట్టి రోడ్డుపై విసిరిన తల్లి

ఈ కేసుపై న్యాయమూర్తి గురుపాల్ సింగ్ అహ్లూవాలియా విచారణ జరిపారు. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం.. పదిహేనేళ్లు పైబడిన భార్యతో భర్త శృంగార చర్య అత్యాచారం కిందకు రాదన్నారు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా భారతీయ చట్టాలు ఇంకా గుర్తించలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అసహజ శృంగారానికి భార్య అనుమతి అంశం ప్రాధాన్యం కోల్పోతుందని… తనతో పాటు ఉంటున్న భార్యతో భర్త అసహజ శృంగారం నేరం కాదని సెక్షన్ 377 చెబుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే, సెక్షన్ 376బీ ప్రకారం విడిగా ఉంటున్న భార్యతో ఆమె అనుమతి లేకుండా శృంగారం అత్యాచారమేనని స్పష్టం చేశారు. కాబట్టి ఈ కేసులో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని తీర్పు వెలువరించారు.

ఇది కూడా చదవండి: Budi Mutyala Naidu: డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర డ్రోన్ల కలకలం..