Unique Wedding : ఇద్దరికి న్యాయం చేసావా తల్లీ.. మొగుడితో 10 మంది కని, ఇప్పుడు ప్రియుడితో పెళ్లా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unique Wedding : ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ జిల్లాలో విచిత్రమైన పెళ్లి జరిగింది. తన భర్తతో పదిమంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. సంవత్సరం కింద గ్రామం నుంచి అతడితో జంప్ అయింది. మళ్లీ ఏడాది తర్వాత స్వగ్రామానికి వచ్చి గ్రామస్తుల సమక్షంలో కోరుకున్న ప్రియుడిని పెళ్లి చేసుకుంది. అంతే కాకుండా గ్రామస్తులు పెళ్లి చేసి కొత్త దంపతులకు కానుకలు కూడా ఇవ్వడం విశేషం.
Read Also: Traffic restrictions: రేపు కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. ఆ రూట్లల్లో వెళ్లి పరిషాన్ అవ్వకండి
Also Read
- EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
- Hyderabad: అల్వాల్లో విషాదం.. విద్యుత్ షాక్తో తండ్రీకూతురు మృతి.!
- Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
- Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
బహల్గంజ్ ప్రాంతానికి చెందిన సోనీ శర్మ(42).. మొదటి భర్త ఆరేళ్ల క్రితం చనిపోయాడు. కానీ, ఆమె అప్పటికే ఆమెకు పది మంది పిల్లలకు జన్మనిచ్చింది. భర్త చనిపోయాక సోనీ శర్మ.. అదే గ్రామానికి చెందిన బాలేంద్ర(40) అనే వ్యక్తితో ప్రేమలో పడింది. కానీ అతడిని వివాహం చేసుకోలేదు. ఏడాది క్రితం గ్రామం నుంచి వీరు వెళ్లిపోయి వేరే ప్రాంతంలో సహజీవనం చేస్తున్నారు. అప్పుడప్పుడు.. సోనీ శర్మ గ్రామానికి వచ్చిపోతుండేది. ఆ సమయంలో స్థానికులు.. పిల్లల బాగోగులు అడిగి తెలుసుకునేవారు. బాలేంద్ర, సోనీ ప్రేమ విషయం గ్రామంలో అందరికీ తెలుసు. దీంతో వారిద్దరికి పెళ్లి చేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.. అంతేకాకుండా ఆ పది మంది పిల్లలకు అండగా ఉండాలనుకున్నారు.
Read Also:Abhilash Tomy: చరిత్ర సృష్టించిన సెయిలర్ అభిలాష్ టామీ.. ప్రీమియర్ గ్లోబల్ రేస్లో 2వ స్థానం
అదే గ్రామానికి చెందిన గురుకుల పీజీ కాలేజీ ప్రిన్సిపల్ జై ప్రకాశ్ షాహీ.. సోనీశర్మ, బాలేంద్రను పిలిచి పంచాయతీ పెట్టారు. ఇద్దరినీ ఒప్పించి స్థానిక శివాలయంలో వారికి పెళ్లి చేశారు. గ్రామస్థుల సమక్షంలో సోనీ, బాలేంద్ర ఒక్కటయ్యారు. సోనీ శర్మ పది మంది పిల్లలకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని పీజీ కళాశాల ప్రిన్సిపల్ జైప్రకాశ్ తెలిపారు. బాలేంద్ర, సోనీ శర్మకు తమ కాలేజీలో ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లు చెప్పారు. దంపతులు కలిసి ఉండేందుకు ఉచితంగా వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
-
Hyderabad: అల్వాల్లో విషాదం.. విద్యుత్ షాక్తో తండ్రీకూతురు మృతి.!
-
Mollywood Times Controversy : ‘మాలీవుడ్ టైమ్స్’ నిర్మాతలపై సెన్సార్ టీం గరం గరం… మ్యూట్ చేసిన పదాలతో సినిమా రిలీజ్
-
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
-
Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!